న్యూఢిల్లీ : వన్ప్లస్ నార్డ్ సీఈ 3 త్వరలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. మిడ్రేంజ్ వన్ప్లస్ (OnePlus) ఫోన్ స్నాప్డ్రాగన్ 695 ఎస్ఓసీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. వన్ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ లాంఛ్ డేట్ను కంపెనీ అధికారికంగా వెల్లడించకున్నా ఈ స్మార్ట్ఫోన్ లాంఛ్ను కంపెనీ జూన్, జులైలో ప్రకటించవచ్చని వార్తలు రాగా తాజాగా మార్చిలోనే వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లాంఛ్ ఉంటుందని మరికొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయి.
వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లిస్టింగ్ ఇండియన్ వెబ్సైట్లో కనిపించిందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ వెల్లడించడంతో త్వరలోనే ఈ ఫోన్ కస్టమర్ల ముందుకొస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక వన్ప్లస్ నార్డ్ సీఈ 3 పవర్ఫుల్ ప్రాసెసర్తో 8జీబీ ర్యాం, 256జీబీ స్టోరేజ్తో 6.7 ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్తో రానుంది.
అప్కమింగ్ వన్ప్లస్ నార్డ్ సీఈ 3 భారీ బ్యాటరీతో ఫాస్టర్ చార్జింగ్ స్పీడ్స్ను సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ 3 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో కూడిన తొలి ఫోన్. ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Read More :