(Smart Insulin) డయాబెటిస్తో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర స్థాయిల సమతుల్యత పాటించేందుకు చాలా కష్టపడుతుంటారు. ఆహారం, వ్యాయామం, ఇన్సులిన్ థెరపీ వంటి గారడీలు చేయాల్సి వస్తున్నది. షుగర్తో బాధపడుతున్న వారికి వెలుగులు పంచే ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇదే కోవలో అమెరికాకు చెందిన పరిశోధకులు చేపట్టిన కొత్త విధానం ఇన్సులిన్పైనే దృష్టి పెట్టడం మరింత సంతోషాన్ని కలిగిస్తున్నది. వీరు ఇన్సులిన్ మాలిక్యూల్ ఆకారంలో నిర్మించే ఫీచర్పైనే దృష్టి సారించారు. సాధారణ చక్కెర అణువు మాదిరిగా ఇన్సులిన్ అణువును ఒక ‘కీ’ సమక్షంలో తెరిచేలా చేయడమే ఈ కొత్త డిజైన్ ఉద్దేశం.
ఇండియానా యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన బయోకెమిస్ట్ మైఖేల్ వీస్, అతడి సహచరులు డయాబెటిస్ టైప్-1 చికిత్సపై పరిశోధనలు జరుపుతున్నారు. ఇందుకు వీరు ఇన్సులిన్ అణువును స్టడీ చేసేందుకు తిరిగి డ్రాయింగ్ బోర్డును ఎంచుకున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను ఇన్సులిన్ యాక్టివేషన్తో సాధారణ కార్బోహైడ్రేట్ ఉనికిని ప్రతిస్పందించడానికి నిర్మాణాన్ని సర్దుబాటు చేశారు. మైఖేల్ వీస్, అతడి బృందం చేసిన ప్రయోగాలు కార్బోహైడ్రేట్ ఫ్రక్టోజ్ని ఉపయోగించింది. వీరి ప్రయోగం ఇన్సులిన్ను మానిప్యులేట్ చేయగలదని చూపించింది. కొంత మొత్తంలో చక్కెర ఉండటం ద్వారా ‘స్విచ్ ఆన్’ చేసినప్పుడు కాలేయం నుంచి పొందిన కణాల నమూనాను మాత్రమే యాక్టివేట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇది డయాబెటిస్ చికిత్సలో చాలా అంచనాలను సున్నితంగా మార్చేందుకు మార్గం సుగమం చేయనున్నది. ఈ రకమైన ‘స్మార్ట్’ ఇన్సులిన్తో డయాబెటిక్ కేర్ను సమూలంగా మారుస్తుందని, ఇకపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మైఖేల్ వీస్ తెలిపారు.
టైప్ 1 డయాబెటిస్ ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 15 మందిని ప్రభావితం చేస్తుంది. అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోవడమే. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల మెటబాలిజం నియంత్రణ కోల్పోయి డయాబెటిస్కు దారితీస్తుంది. శతాబ్దాలుగా షుగర్ వ్యాధికి మందులు అందుబాటులో లేవు. అయితే, ఇన్సులిన్ను శుద్ధి చేసి కృత్రిమంగా ఇంజెక్షన్ ద్వారా అందివ్వవచ్చుని శాస్త్రవేత్తలు గుర్తించిన తర్వాత లక్షల మంది జీవితాలు మారిపోయాయి.
జూలై నెలలో పెరిగిన వాహనాల డిమాండ్
ఆఫ్ఘాన్ నుంచి మన వాళ్లను రప్పించండి : కాంగ్రెస్
12 రెట్లు పెరిగిన ఎంఆర్ఎఫ్ లాభం
మార్కెట్లోకి హోండా ఇ-స్కూటర్ యు-గో
కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..