రోజురోజుకూ టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. ఆ టెక్నాలజీని అడ్డం పెట్టుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆ టెక్నాలజీయే వాళ్లకు వరంలా మారుతోంది. యూజర్లకు శాపంలా మారుతోంది. ఇప్పటి వరకు ఎన్నో స్పైవేర్స్ వచ్చాయి. స్మార్ట్ఫోన్లను అటాక్ చేశాయి. సైబర్ క్రిమినల్స్ పలు స్పైవైర్లను తయారు చేసి వాటిని ఆండ్రాయిడ్ యాప్స్లోకి పంపిస్తున్నారు. ఆ ఆండ్రాయిడ్ యాప్స్ను ఇన్స్టాల్ చేసుకున్న యూజర్ల స్మార్ట్ఫోన్ నుంచి ఆ స్పైవేర్ ద్వారా డేటాను మొత్తం తస్కరిస్తున్నారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న తతంగమే.
ప్రస్తుతం మరో స్పైవేర్ స్మార్ట్ఫోన్ యూజర్లను భయపెడుతోంది. దాని పేరు ఫోన్స్పై స్పైవేర్(PhoneSpy spyware) లేదా మాల్వేర్. ఇది ఏం చేస్తుందంటే.. ఆండ్రాయిడ్ ఫోన్లోకి ఎలా ప్రవేశించాలా అనేదే దీని టార్గెట్. దాని కోసం కొన్ని యాప్స్ను ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. జెన్యూన్గా కనిపించే 23 యాప్స్లోకి దీన్ని సైబర్ క్రిమినల్స్ పంపించారు. ఈ యాప్స్ ద్వారా స్మార్ట్ఫోన్లోకి స్పైవర్ ప్రవేశిస్తుంది.
ఒకసారి ఈ స్పైవర్.. స్మార్ట్ఫోన్లోకి యాప్ ద్వారా వచ్చాక.. యూజర్ పర్మిషన్తో సంబంధం లేకుండా తనంతట తానే కెమెరాను ఓపెన్ చేస్తుంది. ఫోటోలు, వీడియోలు తీస్తుంది. ఫోన్లోని డేటాను కూడా సేకరిస్తుంది. వాటిని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. వాటిని అడ్డంపెట్టుకొని నేరగాళ్లు.. బ్లాక్ మెయిల్ చేయడం, సైబర్ నేరం చేయడం లాంటివి చేస్తుంటారు.
గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ అన్నీ సేఫ్ యాప్స్ లాగానే కనిపిస్తాయి. ఎప్పుడైతే యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తామో అవి ఆన్ డివైజ్ పర్మిషన్లను అడుగుతాయి. అప్పుడు వెంటనే అది డేంజరస్ యాప్ అనుకోవాలి. ఒకవేళ.. ఆన్ డివైజ్ పర్మిషన్ ఇస్తే.. ఫోన్స్పై మాల్వేర్ స్మార్ట్ఫోన్లోకి చొరబడినట్టే. అందుకే.. ఏ యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకునే ముందు ఆన్ డివైజ్ పర్మిషన్ను అడిగితే.. వెంటనే ఆ యాప్ను అన్ఇన్స్టాల్ చేసుకోండి.
ప్రస్తుతం ఈ స్పైవేర్ ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్లు వెయ్యి మంది దాకా ఉన్నారు. ఫోన్స్పై స్పైవేర్ కేసులు ఎక్కువగా సౌత్కొరియాలో నమోదు అవుతున్నాయి. కానీ.. ఆ స్పైవేర్.. ప్రపంచమంతా విస్తరించడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. అందుకే.. ముందే జాగ్రత్తగా ఉంటే ఆ స్పైవేర్ దాడి నుంచి తప్పించుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tech | స్మార్ట్ ఫోన్లో వైరస్ అటాక్ చేస్తే ఎలా కనిపెట్టాలి… ?టెక్ నిపుణులు ఏం చెబుతున్నారు..?
టెక్నో పాప్ 5సీ బడ్జెట్ స్మార్ట్ఫోన్ లాంఛ్
Xiaomi : 30న భారత్లో రెడ్మి నోట్ 11టీ లాంఛ్
WhatsApp : వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ ఇరిటేటింగ్ ఫీచర్ కనిపించదు
iPhone X : రూ.64 లక్షలకు అమ్ముడుపోయిన ఐఫోన్ ఎక్స్.. ఎక్కడో తెలుసా?