రెండేండ్ల నుంచీ ప్రతి వస్తువునూ శానిటైజ్ చేయడం మనకు అలవాటైపోయింది. అతినీలలోహిత కిరణాలతో క్రిమిరహితం చేయడంతోపాటు సాంకేతిక పరికరాలకు చార్జింగ్ పెట్టేలా సరికొత్త శానిటైజర్ను రూపొందించింది బెల్కిన్ సంస్థ. ఓ బుల్లిపెట్టెలో పెడితేచాలు.. కార్డులు, తాళంచెవులు, ఫోన్లు, వాచీలు, ఇయర్పాడ్స్ దేన్నయినా 99.9 శాతం క్రిమిరహితంగా మార్చగలదు. ఈ శానిటైజర్కు జతచేసిన వైర్లెస్ చార్జింగ్ ప్యాడ్ సాయంతో స్మార్ట్ ఫోన్, వాచ్.. వంటివి చార్జ్ చేసుకోవచ్చు. 10 వాట్స్ సామర్థ్యం ఉన్న ఈ చార్జర్ కమ్ శానిటైజర్ ఆన్లైన్ ధర రూ. 5,470. వివరాలకు belkin.com.
పని ఒత్తిడి వల్ల కండరాలు పట్టేస్తుంటాయి చాలామందికి. ఉద్యోగుల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. అలా పట్టేసిన చోట నొప్పి తగ్గించేలా రకరకాల పెయిన్బామ్లు, స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. వాటితో మసాజ్ చేయించుకోవాలంటే మాత్రం.. మరొకరిని సాయం అడగాల్సిందే. అయితే రెండో వ్యక్తి అవసరం లేకుండా ఎవరికి వారే మసాజ్ చేసుకునేలా రూపొందిందే.. ఫ్లెక్స్నెస్ట్ మసాజ్ గన్. కాళ్లు, చేతులు, మెడ, భుజాలు.. ఇలా ఎక్కడ కండరాలు పట్టేసినా దీంతో చక్కగా మర్దన చేసుకోవచ్చు. చార్జింగ్తో పనిచేసే ఈ మసాజర్ను చేత్తో పట్టుకునేందుకు వీలుగా ఓ పెడల్ ఉంటుంది. నాలుగు రకాల భిన్నమైన వేగాలతో ఇది మసాజ్ చేయగలదు. ఒక్కసారి చార్జ్ చేస్తే 8 గంటల వరకూ పనిచేస్తుంది. ఈ మసాజ్ గన్ ఆన్లైన్ ధర రూ.4,999. పూర్తి వివరాలకు theflexnest.com క్లిక్ చేయండి.
ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచీలనే వాడుతున్నారు. సాధారణ వాచీల తయారీ కంపెనీలు కూడా తామేం తక్కువ కాదంటూ రకరకాల డిజైన్లు, ఫీచర్లతో సరికొత్త చేతి గడియారాలను రూపొందిస్తున్నాయి. ప్రముఖ వాచీల తయారీ సంస్థ ఐకేపాడ్.. లిమిటెడ్ వెర్షన్గా స్కైపాడ్ అనే ఓ కొత్త సిరీస్ను విడుదల చేసింది. బ్లూ, బ్లాక్ కలర్స్లో అందుబాటులో ఉన్న ఈ వాచీలో ఆకాశంలో నక్షత్రాల మాదిరిగా చుక్కలు తళుక్కున మెరుస్తుంటాయి. వాటిమధ్య అంకెలూ ఉంటాయి. ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్న ఈ అందమైన వాచీ ఆన్లైన్ ధర రూ.7.32 లక్షలు. పూర్తి వివరాలకు ikepod.com చూడవచ్చు.
స్మార్ట్ ఫోన్తోపాటు బ్లూటూత్, ఇయర్పాడ్స్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్స్తో రకరకాల ఇయర్పాడ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. చార్జింగ్ పెట్టిన దగ్గరో, ఆఫీస్లోనో, బ్యాగ్లోనో.. ఏదో ఓ చోట తరచుగా మరిచిపోయే వస్తువుల్లో ఇయర్పాడ్స్ ఒకటి. అయితే ఇప్పుడు సెన్సర్ సాయంతో కనిపెట్టగల సరికొత్త ఇయర్
పాడ్స్ను అందుబాటులోకి తెచ్చింది ఆపిల్. ఎక్కడున్నా సరే, మన ఫోన్ ద్వారా శబ్దాల్ని పంపి ఇట్టే గుర్తించవచ్చు. వీటి బ్యాటరీ సామర్థ్యం, ప్లేబ్యాక్ సమయమూ ఎక్కువే. ఆన్లైన్ ధర రూ. 24,500. మరిన్ని ఫీచర్స్ కోసం apple.com చూడవచ్చు.
ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు దేవుణ్ని తలుచుకోవడం, ఏదైనా రాసేటప్పుడు ఓంకారంతో ప్రారంభించడం భారతీయ సంప్రదాయం. తొలుత అవిఘ్నమస్తు అంటూ పరమాత్మను స్మరించుకోడం వల్ల అవరోధాలు లేకుండా పని జరిగిపోతుందని నమ్మకం. సాక్షాత్తు, ఇష్ట దైవాన్ని ముద్రించిన కలంతో రాస్తే ఇక తిరుగేం ఉంటుందీ! అందుకే వేంకటేశ్వర స్వామి ప్రతిబింబంతో కలాలను అందుబాటులోకి తెచ్చింది ఒక్యులస్. టైటానియం, స్టీల్ టిప్తో గోల్డెన్ బ్రాస్ లోహంతో తయారుచేసిన ఈ బంగారు వర్ణపు పెన్నుపై స్వామివారు నీలమేఘఛాయలో దర్శనమిస్తారు. ఈ పెన్ను ఆన్లైన్ ధర రూ.549. దీనితోపాటు స్వామివారి ప్రతిబింబం ఉన్న కీచైన్ ఉచితం.
“Naya Mall | లగేజ్ సూట్కేస్తోనే ఇక స్మార్ట్ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు”