ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసిన మంత్రులు, నేతలకు సీఎం కేసీఆర్ అభినందన
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): వెల్డన్.. అందరూ బాగా కష్టపడ్డారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరంగల్, ఖమ్మం, నల్లగొండకు చెందిన టీఆర్ఎస్ నేతలను అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని వారికి ఉద్బోధించారు. కలిసికట్టుగా పనిచేస్తే ఇటువంటి ఫలితాలే వస్తాయని అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జీ జగదీశ్వర్రెడ్డి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీలు పసునూరి దయాకర్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు, ఎమ్యెల్యేలు, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లాపరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, పార్టీ ముఖ్యనాయకలు ఆదివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలవారీగా, విడివిడిగా సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీగా రెండోసారి విజయం సాధించిన పల్లా రాజేశ్వర్రెడ్డిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ సహా పలువురు నేతలు సీఎంను కలిశారు.