న్యూఢిల్లీ : భారత్లో ఈ ఏడాది తన తొలి ప్రీమియం ఫోన్ను మే 23న లాంఛ్ చేసేందుకు మొటొరోలా సన్నాహాలు చేపట్టింది. గత ఏడాది లాంఛ్ అయిన మొటొరోలా ఎడ్జ్ 30 ప్రొ, ఎడ్జ్ 30 ఫ్యూజన్లకు మధ్య సెగ్మెంట్లో మొటొరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40) కస్టమర్లను ఆకట్టుకోనుంది. లాంఛ్కు ముందు ఫ్లిప్కార్ట్లో కంపెనీ ఇప్పటికే అధికారిక పేజ్ను సిద్ధం చేసింది.
ఈ పేజ్లో అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఫీచర్లు, డిజైన్ గురించి కీలక వివరాలను వెల్లడించింది. కస్టమర్లకు ఈ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్స్లో అందుబాటులో ఉంది. అధికారిక పోస్టర్లో అప్కమింగ్ స్మార్ట్ఫోన్ కర్వడ్ డిస్ప్లేతో ఆకట్టుకుంటోంది. మొటొరోలా ఎడ్జ్ 40 6.5 ఇంచ్ డిస్ప్లేతో ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ స్మార్ట్ఫోన్ కస్టమర్ల ముందుకు రానుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ఎస్ఓసీ చిప్సెట్తో ముందుకొచ్చిన తొలి మొటొరోలా ఫోన్గా మొటొరోలా ఎడ్జ్ 40 నిలవనుంది. ఇక స్మార్ట్ఫోన్ ఫీచర్లు, స్పెసికేషన్ల ఆధారంగా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ధర దాదాపు రూ. 45.000 వరకూ ఉంటుందని అంచనా. ఇక ప్రస్తుతం మొటొరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ రూ. 39999 నుంచి లభిస్తుండగా ఎడ్జ్ 30 అల్ట్రా ధర రూ. 49999కి లభిస్తోంది.
Read More
iPhones-Tata | టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఐ-ఫోన్ల తయారీ.. ఎప్పటి నుంచో తెలుసా?!