ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల కాలం నడుస్తోంది. అందుకే.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ.. సరికొత్త మోడల్స్ను మార్కెట్లో విడుదల చేసేందుకు పోటీ పడుతున్నాయి. అందుకే.. మోటరోలా బ్రాండ్ కూడా సామ్సంగ్, జియోమీ, వివో, రియల్మీ, ఒప్పో ఫోన్లతో పోటీ పడేందుకు.. అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తోంది. తాజాగా మోటరోలా.. ఎడ్జ్ 20 సిరీస్లో భాగంగా.. ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యూజన్ మోడల్స్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఎడ్జ్ సిరీస్లో ఈ రెండు ఫోన్లను భారత మార్కెట్లోకి ఈనెల 17న రిలీజ్ చేయనుంది.
అయితే.. భారత మార్కెట్లోకి ఇంకా రిలీజ్ కాకముందే.. ఈ మోడల్స్ ధరలు అప్పుడే లీక్ అయిపోయాయి. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యుజన్ ధర రూ.21 వేలుగా ఉంటుందని అంచనా వేస్తుండగా.. మోటరోలా ఎడ్జ్ ధర రూ.30 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది.
గత నెలలోనే ఈ రెండు మోడల్స్ను యురోపియన్ మార్కెట్లో మోటరోలా విడుదల చేసింది. మోటరోలా ఎడ్జ్ 20తో పాటు.. మోటరోలా ఎడ్జ్ 20 ప్రో, మోటరోలా ఎడ్జ్ 20 లైట్ మోడల్స్ను కూడా విడుదల చేసింది. మోటరోలా ఎడ్జ్ 20 లైట్ మోడల్కు కొనసాగింపుగా ఇండియా మార్కెట్లోకి మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యుజన్ను విడుదల చేస్తున్నట్టు మోటరోలా ప్రకటించింది.
మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యుజన్.. రెండు వేరియంట్లలో రానుంది. 6జీబీ, 128 జీబీ ఒక వేరియంట్.. 8జీబీ, 128 జీబీ మరో వేరియంట్తో రానున్నాయి. 6 జీబీ వేరియంట్ ధర రూ.21,499, 8 జీబీ వేరియంట్ ధర రూ.23,999 అని తెలుస్తోంది. మోటరోలా ఎడ్జ్ 20 మోడల్ మాత్రం ఒకే వేరియంట్ 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్తో లభించనుంది. దాని ధర రూ.29,999 అని తెలుస్తోంది.
ఇక.. ఈ మోడల్స్ ఫీచర్ల విషయానికి వస్తే.. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యుజన్.. 10 బిట్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లేతో 90 హెడ్జ్ రీఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800 యూ ఎస్వోసీ, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో రానుంది. 108 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇక.. మోటరోలా ఎడ్జ్ 20 మోడల్లో 108 ఎంపీ రేర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఓఎస్, 6.70 ఇంచ్ డిస్ప్లే, 1080 * 2400 పిక్సెల్ రిజల్యూషన్ లాంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.