న్యూఢిల్లీ : అందుబాటు ధరలో అన్ని ఫీచర్లు కలిగిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్లపై కంపెనీలు దృష్టిసారించాయి. ప్రీమియం మొటొరోలా రేజర్ 40 సిరీస్ను ప్రవేశపెట్టిన అనంతరం మొటొరోలా భారత్లో మోటో జీ84 5జీని (Moto G84 5G) లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించింది.
లేటెస్ట్ 5జీ ఫోన్ను సెప్టెంబర్ 1న లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. లేటెస్ట్ మోటో ఫోన్ మిడ్నైట్ బ్లూ, వివా మాగ్నెంటా, మార్ష్మాలో బ్లూ వంటి మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. లాంఛ్కు ముందు లేటెస్ట్ మోటో జీ84 ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. మోటో ఈ84 5జీ 3.5ఎంఎం ఆడియో జాక్తో పాటు 6.5 ఇంచ్ పోల్డ్ డిస్ప్లే కలిగిఉంటుంది.
ఇతర మోటొరొలా ఫోన్ల తరహాలోనే లేటెస్ట్ డివైజ్ స్పీకర్లు కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగిఉన్నాయి. 30డబ్ల్యూ టర్బోపవర్ చార్జింగ్ టెక్నాలజీతో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. మోటో జీ84 5జీ బేస్ మోడల్ రూ. 20,000లోపు అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక మోటో జీ84 5జీ షియామి రెడ్మి నోట్ 12 సిరీస్, రియల్మీ 11 ప్రొ సిరీస్ ఫోన్లకు మోటో జీ84 5జీ గట్టి పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More :
Jio | యూజర్లకు జియో షాక్.. బేసిక్ ప్రీపెయిడ్ ప్లాన్ ఔట్.. ఎందుకంటే?!