Jio | ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో.. తన ప్రీపెయిడ్ యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న ప్రీపెయిడ్ బేసిక్ రీచార్జీ ప్లాన్ రూ.119 నిలిపేసింది. ఇప్పుడు జియో ఫోన్ ప్రీపెయిడ్ యూజర్లు ప్రాథమికంగా రూ.149 పే చేయాలి. 2021 చివర్లో తెచ్చిన రూ.119 ప్లాన్తో 14 రోజులపాటు అన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు ప్రతి రోజూ 1.5 జీబీ డేటా అందించేది. రోజూ 100 మెసేజ్ లు పంపించవచ్చు. కానీ కొత్త ప్లాన్ కింద రోజుకి కేవలం ఒక జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.
ఒక్కో యూజర్ మీద సగటు ఆదాయం (అర్పు) పెంచుకునేందుకే జియో తన ప్రీపెయిడ్ బేసిక్ ప్లాన్ తొలగించినట్లు తెలుస్తున్నది. రూ.119 ప్లాన్ స్థానే 20 రోజుల వ్యాలిడిటీ గల రూ.149 రీచార్జి ప్లాన్ తెచ్చింది. ఈ ప్లాన్ కింద ప్రతి రోజూ ఒక జీబీ డేటా, 100 మెసేజ్లు పంపించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అదనంగా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ యాప్స్ కార్యక్రమాలు వీక్షించడానికి అవకాశం ఉన్నా.. అన్ లిమిటెడ్ 5జీ డేటా లభించదు.
ఇటీవల ప్రీపెయిడ్ యూజర్ల కోసం నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో రెండు వేర్వేరు ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్ ఆప్షన్ గల ప్లాన్ టారిఫ్ రూ.1099గా నిర్ణయించింది. ఇక ఇదే 84 రోజుల వ్యాలిడిటీ గల రూ.1499 ప్లాన్ కింద అన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు ప్రతి రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్లలో జియో వెల్కం ఆఫర్తో ఉచితంగా 5జీ డేటా అందుకోవచ్చు.