న్యూఢిల్లీ : మొటొరోలా భారత్లో మార్చి 10న మోటో జీ73 5జీని (Moto G73 5G) లాంఛ్ చేయనుంది. దేశీ మార్కెట్లో మోటో జీ73 5జీ లాంఛ్పై కంపెనీ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. మోటో లేటెస్ట్ డివైజ్పై ప్రముఖ టెక్ నిపుణులు ముకుల్ శర్మ పలు వివరాలు వెల్లడించారు. మోటో జీ73 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 930 ఎస్ఓసీ చిప్సెట్తో వెనుకభాగంలో డ్యూయల్ కెమెరాలతో ఎంట్రీ ఇవ్వనుంది.
ఇతర మొటొరోలా 5జీ స్మార్ట్ఫోన్ల తరహాలోనే అప్కమింగ్ మోటో జీ73 5జీ 13 5జీ బ్యాండ్ సపోర్ట్ కలిగిఉంటుంది. ఇక మోటో జీ73 5జీ డిజైన్ పరంగా గ్లోబల్ వేరియంట్ను పోలిఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ బ్లూ కలర్ ఫినిష్తో పాటు పలు కలర్ ఆప్షన్స్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లో మొటొరోలా న్యూ 2యూఎం అల్ట్రా పిక్సెల్ కెమెరాను వాడుతుందని శర్మ పేర్కొన్నారు.
ఈ అంచనా నిజమైతే మోటో జీ73 5జీ 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగిఉంటుంది. మోటో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకొస్తుంది. డాల్బీ అట్మాస్ సౌండ్తో స్టీరియో స్పీకర్లతో లేటెస్ట్ మోటో ఫోన్ రానుంది. ఇక మోటో జీ73 5జీ భారత్లో దాదాపు రూ. 20,000 నుంచి అందుబాటులో ఉంటుంది.
Read More :