Meta | సోషల్ మీడియా కంపెనీ మెటా ఆన్లైన్ మోసాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కొత్తగా సెక్యూరిటీ ఫీచర్స్తో పాటు అవెర్నెస్ టూల్స్ను ప్రారంభించింది. ప్రత్యేకంగా సైబర్ మోసాల బారి నుంచి వినియోగదారులను రక్షించడమే లక్ష్యంగా వీటిని తీసుకువచ్చింది. చూజర్లు ఇప్పుడు వాట్సాప్లో తెలియని వ్యక్తితో తమ స్క్రీన్ను షేర్ చేసిన సమయంలో వార్నింగ్ మెస్సేజ్ వస్తుందని మెటా కంపెనీ పేర్కొంది. చాలా మంది స్కామర్స్ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు వంటి సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తారని కంపెనీ చెబుతున్నది. ఈ కొత్త టూల్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి యూజర్లకు హెచ్చరికలు చేస్తుంది. మెసెంజర్లో ఏఐ ఆధారిత స్కామ్ డిటెక్షన్ సిస్టమ్ ప్రస్తుతం మెటా పరీక్షిస్తోంది. అనుమానాస్పద మెస్సేజ్లు వస్తే.. యూజర్ను హెచ్చరిస్తుంది.
అవసరమైతే చాట్ను ఏఐ స్కానింగ్ కోసం పంపే అవకాశం ఉంటుంది. అదనంగా, పాస్కీస్ ఫీచర్ను ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్లకు సైతం జోడించొచ్చు. దాంతో యూజర్ల ఫింగర్ప్రింట్, ఫేస్, పిన్ ఐడీలను భద్రంగా ఉంచుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలోని ‘సెక్యూరిటీ చెకప్’ ఫీచర్ ఇప్పుడు యూజర్ల తమ అకౌంట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ను సమీక్షించుకోవడానికి అనుమతిస్తుంది మెటా పేర్కొంటున్నది. వాట్సాప్లో ‘ప్రైవసీ చెకప్’ యూజర్లు వారిని గ్రూప్లకు ఎవరు చేర్పించాలో నిర్ణయించడంలోనూ సహాయపడుతుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో మయన్మార్, లావోస్, కంబోడియా, యూఏఈ, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి పనిచేస్తున్న ఎనిమిది మిలియన్లకుపైగా స్కామ్ అకౌంటర్లను బ్లాక్ చేసినట్లు మెటా వెల్లడించింది. కస్టమర్ సపోర్ట్ పేరుతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న 21వేలకుపైగా ఫేక్ పేజీలు, అకౌంట్లను తొలగించామని చెప్పింది.