ఎప్పుడెప్పుడా అని స్మార్ట్ఫోన్ లవర్స్ ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన, అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్ను అందిస్తాం.. అని చాలెంజ్ చేసిన రిలయెన్స్ జియో.. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా జియోఫోన్ నెక్స్ట్ను విడుదల చేయనుంది. జియోఫోన్ నెక్స్ట్ గురించి.. కంపెనీ ఏజీఎం మీటింగ్లోనే ముఖేశ్ అంబానీ వెల్లడించారు.
జియోఫోన్ నెక్ట్స్ 4జీ ఫోన్ను గుగుల్ కంపెనీతో కలిసి డెవలప్ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఫోన్ లాంచ్ డేట్ను వెల్లడించారు.
అయితే.. ఈ ఫోన్లోని ఫీచర్స్, ధర గురించి ఇంకా సందిగ్ధత నెలకొన్నప్పటికీ.. ఫోన్ లాంచ్ రోజునే అన్ని వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వర్షన్ ఓఎస్తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ సర్వీసులతో పాటు.. గూగుల్ ప్లే స్టోర్ను కూడా ఈ ఫోన్లో యాక్సెస్ చేసుకోవచ్చు. 5.5 ఇంచ్ డిస్ప్లే, వాయిస్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్ లౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, స్మార్ట్ కెమెరా(రియాల్టీ ఫిల్టర్స్) లాంటి ఫీచర్లు ఈ ఫోన్తో రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Realme Pad : రియల్మీ నుంచి తొలి ట్యాబ్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
Redmi Earbuds 3 Pro : 30 గంటల బ్యాటరీ లైఫ్తో రెడ్మీ ఇయర్బడ్స్ 3 ప్రో విడుదల