న్యూఢిల్లీ: (Digital quality of life) డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ (డీక్యూఎల్) లో భారతదేశం మెరుగైన ర్యాంకు సంపాదించింది. ప్రపంచంలో 59 వ స్థానంలో భారత్ ఉంది ఈ-సెక్యూరిటీ విషయంలో చైనా కంటే మెరుగ్గా భారతదేశం ఉండటం సంతోషించదగిన విషయం. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ మూడవ వార్షిక ఎడిషన్ నివేదికను గురువారం విడుదల చేశారు.
డీక్యూఎల్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 110 దేశాలలో భారతదేశం 59 వ స్థానంలో ఉన్నది. ప్రపంచ జనాభాలో 90 శాతం మందిని కవర్ చేస్తూ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సర్ఫ్షార్క్ డీక్యూఎల్ అధ్యయనాన్ని నిర్వహిస్తున్నది. ఐదు ప్రాథమిక డిజిటల్ పాయింట్ల ఆధారంగా దేశాలను స్థానాన్ని అంచనా వేస్తుంది. ఈ-గవర్నమెంట్లో భారతదేశం 33 వ స్థానంలో, ఈ-సెక్యూరిటీలో 36, ఇంటర్నెట్ స్థోమతలో 47, ఇంటర్నెట్ నాణ్యతలో 67 వ స్థానంలో ఉండగా.. ఈ-ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాత్రం 91 వ స్థానంలో నిలిచింది.
మొత్తమ్మీద, గత ఏడాది నివేదికతో పోలిస్తే భారతదేశం స్వల్ప తగ్గుదలని ప్రదర్శించింది. భారతదేశం ఇప్పుడు ఆసియాలో 17 వ స్థానంలో, దక్షిణ ఆసియా ప్రాంతంలో మొదటి స్థానంలో ఉన్నది. గత సంవత్సరం నుంచి భారతదేశం ఈ-సెక్యూరిటీ 76 శాతం మెరుగుపడింది. ప్రస్తుతం చైనా కంటే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు.
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్న గవర్నర్లు : శివసేన
పంజాబ్లో తప్పిన భారీ ఉగ్రదాడి, ముగ్గురు అరెస్ట్
కోవలం, ఈడెన్ బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్.. ఎందుకో తెలుసా?
ఐఆర్సీటీసీ ‘లేహ్-లడఖ్’ పర్యాటక ప్యాకేజీ సిద్ధం..
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
కెప్టెన్కు షాకిస్తున్న సీఎం చన్నీ
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
ఎన్నికల కోసం రిచర్డ్ నిక్సన్ ‘చక్కర్’ ప్రసంగం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..