ఢిల్లీ : ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) ఫైనల్ ఇయర్ విద్యార్ధి ఉదయ్గిరి హాస్టల్లోని తన రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడిన విద్యార్ధిని 20 ఏండ్ల ఆయుష్ అష్నగా గుర్తించారు. తాడుతో ఉరివేసుకుని ఆయుష్ తనువు చాలించాడు. ప్రతిష్టాత్మక ఢిల్లీ ఐఐటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఆయుష్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యాడు.
ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హాస్టల్ రూంకు చేరుకుని విద్యార్ధి తల్లితండ్రులకు సమాచారం అందించారు. విద్యార్ధి బలవన్మరణానికి దారితీసిన పరిస్ధితులేంటనేది ప్రాధమిక దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా రాజస్ధాన్లోని కోటలో 17 ఏండ్ల విద్యార్ధి మరణించిన మరుసటి రోజే ఐఐటీ ఢిల్లీలో విద్యార్ధి ఆత్మహత్య వెలుగుచూడటం కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా పలువురు విద్యార్ధులు ఇటీవల బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ర్యాంకుల ఒత్తిళ్లు, మార్కులు, గ్రేడింగ్లతో మానసికంగా, శారీరకంగా విద్యార్ధులు తీవ్ర ఒత్తిడికి లోనవడంతోనే వారు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని, విద్యార్ధులకు కౌన్సెలింగ్ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.