న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ చాట్జీపీటీ రాకతో ఏఐపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ కొనసాగుతోంది. ఏఐతో ఉద్యోగులపై వేటు తప్పదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఏఐ టూల్స్తో ఉత్పాదకత మెరుగవుతుందని మరికొందరు టెక్ దిగ్గజాలు చెబుతున్నారు. ఏఐ ప్రభావంపై ఐబీఎం (IBM) చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాబ్ థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏఐని వాడే మేనేజర్లు ఈ టూల్ను ఉపయోగించని వారి స్ధానాల్లోకి వస్తారని ఆయన అంచనా వేశారు. ఏఐ ప్రభావం ప్రజలు పనిచేసే విధానంపై ఆధారపడి ఉంటుందని థామస్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కొన్ని ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందని ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐదేండ్లలో ఏఐ, ఆటోమేషన్తో 30 శాతం ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఐబీఎం సీఈవో వెల్లడించారని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ పేర్కొంది.
మరోవైపు ఆర్ధిక మందగమనం, స్ధూల ఆర్ధిక పరిస్ధితుల నేపధ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐబీఎం కూడా లేఆఫ్స్ను ప్రకటించింది. ఇక కంపెనీ షేర్లు రెండు శాతం మేర పతనమయ్యాయి. కంపెనీ సాఫ్ట్వేర్, కన్సల్టింగ్ వ్యాపారం నాలుగో క్వార్టర్లో మందగించింది. 3900 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు ఐబీఎం ఇటీవల ప్రకటించింది.
Read More