న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వింటున్నారు. చాలా మంది ఫోన్లలోనే ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. సరసమైన ధరలో మంచి ఫీచర్లతో హెచ్పీ కంపెనీ క్రోమ్బుక్ 11aను భారత్లో ఆవిష్కరించింది. క్రోమ్ ఓఎస్ ఆధారంగా పనిచేసే ల్యాప్టాప్ ధర రూ. 21,999గా నిర్ణయించింది. ఫ్లిప్కార్ట్ ద్వారా క్రోమ్బుక్ను కొనుగోలు చేయొచ్చు.గూగుల్ అసిస్టెంట్ను సపోర్ట్ చేస్తుంది. ఏడాది పాటు 100 GB క్లౌడ్ స్టోరేజ్ను ఉచితం వాడుకునేలా గూగుల్ వన్ మెంబర్షిప్ను అందిస్తోంది.
బడ్జెట్ ధరలో విడుదలైన ల్యాప్టాప్తో విద్యార్థులు సౌకర్యవంతంగా ఇంటినుంచే ఆన్లైన్ తరగతులకు హాజరుకావొచ్చు. 11.6-అంగుళాల HD టచ్ డిస్ప్లే, HD వెబ్క్యామ్, డ్యూయల్ స్పీకర్లు, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మీడియాటెక్ హీలియో MT8183 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 256GB వరకు పెంచుకోవచ్చు.16 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.