HCL Tech Laysoff | భారత ఐటీ రంగంలో పొదుపు చర్యలు మొదలవుతున్నాయి. రోజురోజుకు ప్రతికూల బిజినెస్ వాతావరణం పెరుగుతున్నది. దేశంలోని ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రపంచ వ్యాప్తంగా 350 మంది నిపుణులను తొలగించితొలగించివేసిందని కంపెనీ వర్గాల సమాచారం. తన మైక్రోసాఫ్ట్ న్యూస్ సంబంధ ప్రొడక్ట్స్ క్లయింట్ సేవలందిస్తున్న వారిని సాగనంపినట్లు సమాచారం. తొలగించిన వారిలో భారత్తోపాటు గ్వాటెమాలా, ఫిలిప్పీన్స్ దేశాల్లో పని చేస్తున్న వారు ఉన్నారు.
దీనిపై సంస్థ యాజమాన్యం అధికారిక ప్రకటన చేయలేదు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ అధికార ప్రతినిధి లేఆఫ్లపై స్పందించడానికి నిరాకరించలేదు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్లలో సేవలు కొనసాగుతాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా తదితర టెక్ దిగ్గజాలు ప్రొడక్టివిటీ పెంచాలని తమ ఉద్యోగులను కోరాయి. ట్రావెల్ ఖర్చులు తగ్గించుకోవాలని సూచించాయి.
ఫేస్బుక్ పేరెంట్ మేటా ప్లాట్ఫామ్స్ తమ వర్క్స్ను సింగపూర్కు తరలించడంపై దృష్టి సారించింది. ఆదాయం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మెటా.. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు తగ్గిస్తున్నది. గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ సైతం మొత్తం సిబ్బందిలో 20 శాతం తొలగింపు తప్పదని అంతర్గత హెచ్చరికలు జారీ చేశారు.