న్యూయార్క్ : సెర్చింజన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను (ఏఐ) కంపెనీ ఉపయోగిస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) ప్రకటించారు. పలు రకాల శోధన ప్రశ్నలకు గూగుల్ స్పందించే సామర్ధ్యం ఏఐతో మెరుగవుతుందని పిచాయ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ తన సెర్చింజన్లో చాట్జీపీటీని మిళితం చేసిన క్రమంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక చాట్జీపీటీకి దీటుగా గూగుల్ ఏఐ టూల్ బార్డ్ను లాంఛ్ చేసినా చాట్జీపీటీ తరహాలో యూజర్ల నుంచి ఆదరణ పొందలేదు. ఓపెన్ఏఐ చాట్జీపీటీ ఇతర ఏఐ టూల్స్ నుంచి ఎదురువుతున్న పోటీ నేపధ్యంలో సెర్చింజన్లో ఏఐని వాడనున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
గూగుల్ సెర్చి బిజినెస్ను చాట్బాట్స్ దెబ్బతీయలేవని పిచాయ్ చెబుతున్నారు. గూగుల్ మాతృసంస్ధ అల్ఫాబెట్ ఆదాయంలో సగానికి పైగా రాబడి గూగుల్ సెర్చి బిజినెస్ నుంచే సమకూరుతోంది. తన సెర్చింజన్పై యూజర్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపరిచేందుకు గూగుల్ టెక్నాలజీని విరివిగా వాడనుంది.
చాట్జీపీటీ ఆధారిత బింగ్ సెర్చింజన్ నుంచి పోటీతో పాటు ఖర్చులకు కళ్లెం వేయాలని ఇన్వెస్టర్ల నుంచి గూగుల్కు ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సెర్చింజన్లో ఏఐ ఇంటిగ్రేషన్ పరిశ్రమలో గూగుల్కు దీటైన స్ధానం కల్పిస్తుందని కంపెనీ భావిస్తోంది.
Read More
Naya Mall | ఈ పవర్ బ్యాంక్ ల్యాప్టాప్ల కోసమే ప్రత్యేకం !
Whatsapp Status | వాట్సాప్లోనే కాదు.. ఫేస్బుక్లోనూ స్టేటస్ అప్లోడ్.. అదేలాగంటే?!