క్రిస్మస్ సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2021ను తాజాగా ప్రారంభించింది. ఈ రోజు నుంచే సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కు సేల్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అందరు యూజర్లకు ఈరోజు అర్ధరాత్రి 12 నుంచి అంటే డిసెంబర్ 16, 2021 నుంచి సేల్ ప్రారంభం అవుతుంది. సేల్.. డిసెంబర్ 21 అర్ధరాత్రి వరకు లైవ్లో ఉంటుంది.
ఈ సేల్లో పలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్స్, స్పీకర్లు, హెల్త్కేర్ వస్తువులు, ట్రిమ్మర్స్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్, న్యూట్రిషనల్ ఫుడ్ లాంటి ప్రాడక్ట్స్ మీద భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు.
ఈసేల్లో ప్రాడక్ట్స్ను ఆర్డర్ చేసుకున్న వాళ్లు ఉచిత డెలివరీ ఉండనుంది. తక్కువ ధర, ఈజీ రిటర్న్ పాలసీ, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద, ఈఎంఐ లావాదేవీల మీద 10 శాతం అదనపు డిస్కౌంట్ను ఇవ్వనున్నారు.
ఈ సేల్లో ఫస్ట్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు 30 శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభించనుంది. అలాగే.. యాపిల్, ఒప్పో, సామ్సంగ్, వివో స్మార్ట్ఫోన్ల మీద స్పెషల్ డీల్స్ ఉండనున్నాయి. కొన్ని బ్రాండ్స్ స్మార్ట్టీవీల మీద 70 శాతం వరకు డిస్కౌంట్ను ఫ్లిప్కార్టు అందిస్తోంది. నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ మీద 2000 డిస్కౌంట్ను అందిస్తోంది. రూ.6,999 ధర ఉన్న ఇయర్ ఫోన్స్ను ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ రూ.4,999కే అందిస్తోంది. ఫ్లైట్ బుకింగ్ మీద కూడా ఫ్లిప్కార్ట్ ఈ సేల్లో భారీ ఆఫర్లను అందిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? వెంటనే అప్డేట్ చేసుకోండి.. ఆదేశించిన కేంద్రం
త్వరలో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ లాంచ్.. ప్రకటించిన గూగుల్.. ఫీచర్లు ఇవే
జియో బంపర్ ఆఫర్.. రూపాయితో రీచార్జ్ చేసుకుంటే చాలు.. 30 రోజుల వాలిడిటీ
Jobs in Mobile Tech | టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!