న్యూయార్క్ : ట్విట్టర్ను (Twitter Layoffs) టేకోవర్ చేసిన వెంటనే ఉన్నతాధికారులపై వేటు వేసిన బిలియనీర్ ఎలన్ మస్క్ ఆపై మాస్ లేఆఫ్స్తో పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. మస్క్ హయాంలో ట్విట్టర్లో మెజారిటీ ఉద్యోగులు కొలువులు కోల్పోవడమో, రాజీనామాతో కంపెనీ నుంచి బయటపడటమో జరిగింది. 2022 నవంబర్లో ఇక లేఆఫ్స్ ఉండవని ట్విట్టర్ న్యూ బాస్ మస్క్ స్పష్టం చేశారు.
కొలువుల కోత ఉండదని మస్క్ భరోసా ఇచ్చిన తర్వాత తాజాగా మూడోసారి కంపెనీలో లేఆఫ్స్ చేపట్టాడు. సేల్స్, ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులను తాజా లేఆఫ్స్లో మస్క్ టార్గెట్ చేశాడని ది వెర్జ్ రిపోర్ట్ పేర్కొంది. ట్విట్టర్ యాడ్ బిజినెస్ను పర్యవేక్షిస్తూ నేరుగా మస్క్కు రిపోర్ట్ చేసే ఉద్యోగి కూడా లేటెస్ట్ లేఆఫ్స్లో బాధితుడిగా మారాడని సమాచారం. కంపెనీలో ఫైరింగ్స్ ఉండవని మస్క్ చెప్పిన తర్వాత ఇవి మూడో విడత లేఆఫ్స్ కావడం గమనార్హం.
ట్విట్టర్ యాడ్స్ పనితీరు విధానాన్ని మెరుగుపరచాలని మస్క్ ఉద్యోగులను కోరినట్టు రిపోర్ట్ తెలిపింది. ఇందుకు ఓ వారం రోజుల డెడ్లైన్ విధించాడని చెబుతున్నారు. ఇక తాజా లేఆఫ్స్కు కారణమేంటన్నది వెల్లడికాలేదు. ట్విట్టర్ యాడ్స్ను మెరుగుపరచడం వారంలో అయ్యే పనికాదని, ఇందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని ట్విట్టర్ 2.0 యాడ్స్ మానెటైజేషన్ మేనేజర్ మర్సిన్ కలుక్జ ట్విట్టర్లో రాసుకొచ్చారు.
Read More :