కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహెగాం మండలం దిగడ గ్రామ సమీపంలో సోమవారం పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయాన్నే ఆవులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లాయి.
గ్రామానికి చెందిన కనక తిరుపతి ఆవుపై పులి దాడిచేయగా అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న ఎఫ్బీవోలు రమేశ్, మధుకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.
ఐదు నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన సిడాం విఘ్నేశ్పై పులి దాడి చేసి, హతమార్చింది. తాజాగా ఆవుపై దాడి చేయడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
ఇవి కూడా చదవండి..
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి : మంత్రి శ్రీనివాస్గౌడ్
గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : ఎమ్మెల్సీ కవిత
తేనెటీగల దాడిలో ఏడుగురికి గాయాలు