న్యూఢిల్లీ : అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో రాజీపడకుండా మెరుగైన సామర్ధ్యం కలిగిన స్మార్ట్ఫోన్లకు (Best premium smartphones) డిమాండ్ అధికంగా ఉంది. ముఖ్యంగా రూ. 40,000లోపు స్మార్ట్ఫోన్లకు కస్టమర్ల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తోంది.
అందుబాటు ధరలో హైక్వాలిటీ కెమెరాలు, ఎక్కువ కాలం నిలిచే బ్యాటరీలు, మెరుగైన ప్రాసెసింగ్ పవర్, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కలిగిన మొబైల్ ఫోన్ల కోసం కస్టమర్లు వేచిచూస్తుంటారు. వన్ప్లస్ నార్డ్ 3 నుంచి ఐక్యూఓఓ నియో 7 ప్రొ వరకూ కీలక ఫీచర్లతో కలిగిన ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్లు ఈ క్యాటగిరీలో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
లేటెస్ట్ ప్రాసెసర్లతో పాటు మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం, కండ్లు చెదిరే కెమెరా ఫీచర్లు, 5జీ కనెక్టివిటీతో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు ఈ ధరలో కస్టమర్లకు మెరుగైన ఎంపికగా ముందుకొచ్చాయి. రూ. 40,000లోపు మెరుగైన స్మార్ట్ఫోన్లలో ఈ హాట్ డివైజ్లను కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చు.
ఐక్యూఓఓ నియో 7 ప్రొ : 35,000
వన్ప్లస్ 11ఆర్ 5జీ : 39,900
వన్ప్లస్ నార్డ్ 3 5జీ : 39,000
వివో వీ27 ప్రొ 5జీ : 38,000
Read More