Apple | ఐఫోన్ యూజర్లకు అతి పెద్ద సమస్య చార్జింగ్! తక్కువ కెపాసిటీ బ్యాటరీ ఉండటంతో ఇందులో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండదు ! ఇదే సమస్య అనుకుంటే దీనికంటే పెద్ద సమస్య ఛార్జింగ్ కేబుల్. అన్ని స్మార్ట్ఫోన్లకు ఒకరకమైన ఛార్జింగ్ పిన్ ఉంటే.. యాపిల్ డివైజ్లకు మాత్రం మరో రకమైన ఛార్జింగ్ పిన్ ఉంటుంది. దీంతో ఎక్కడికైనా వెళ్లినప్పుడు చార్జర్ మరిచిపోతే అంతే సంగతులు. ఎవరి దగ్గరైనా ఛార్జర్ దొరికితే ప్రాబ్లెం లేదు కానీ.. లేదంటే తిరిగి ఇంటికెళ్లే దాకా ఫోన్ను పొదుపుగా వాడుకోవాల్సిందే. అయితే ఐఫోన్ యూజర్లకు ఈ సమస్యలు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ! యాపిల్ కూడా త్వరలోనే మిగిలిన స్మార్ట్ఫోన్ల మాదిరి యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ కేబుల్కి మారబోతున్నదని అంటున్నారు టెక్ నిపుణులు.
యాపిల్ కంపెనీ ఏంటి.. యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ కేబుల్కి మారడమేంటని అనుకుంటున్నారా !! కానీ త్వరలోనే ఇది జరగడం ఖాయమని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం యూరోపియన్ యూనియన్, బ్రెజిల్ తీసుకున్న నిర్ణయమే. ఇకపై స్మార్ట్ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నింటికీ ఒకే విధమైన ఛార్జింగ్ కేబుల్ విధానం ఉండాలని ఈ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.దీంతో స్మార్ట్ఫోన్లతో పాటు ట్యాబ్లెట్స్, ఈ రీడర్, ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్, పోర్టబుల్ స్పీకర్లు, డిజిటల్ కెమెరాలు తదితర అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల కంపెనీలు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ను స్టాండర్డ్ ఛార్జింగ్ సిస్టమ్గా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన 2024 ద్వితీయార్ధంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిబంధనకు అనుగుణంగా 24 నెలల్లో అన్ని స్మార్ట్ఫోన్, ఎలక్ట్రానిక్ డివైజ్ కంపెనీలో తమ హార్డ్వేర్లో మార్పులు తీసుకురానున్నాయి. దీంతో యాపిల్ కంపెనీ కూడా తమ డివైజ్లను ఆయా దేశాల్లో విక్రయించాలంటే కచ్చితంగా సింగిల్ ఛార్జింగ్ సిస్టమ్ నిబంధనను పాటించాల్సిందేనని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఫోన్లతో పాటు వేర్వేరు డివైజ్లకు ఛార్జింగ్ ఆప్షన్లు వేర్వేరుగా ఉంటాయి. దీంతో ఒకే ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని ఛార్జర్లు వాడాల్సి వస్తుంది. ఒకవేళ అందులో ఏ ఒక్క ఛార్జర్ పాడైపోయినా కొత్తది కొనాల్సిందే. ఉన్నవి వాడుకునే ఛాన్స్ లేదు. ఈ క్రమంలో ఈ వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి. దీంతో ఛార్జర్ల రూపంలోనే ఏటా 11 వేల టన్నుల ఈ-వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వీటిని తగ్గించేందుకే సింగిల్ ఛార్జింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నామని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ వెల్లడించింది. అంతేకాకుండా ఈ నిబంధన అమల్లోకి వస్తే వినియోగదారులకు 2 వేల కోట్లు (250 మిలియన్ యూరోలు ) ఆదా అవుతాయని తెలిపింది.
ప్రస్తుతం యాపిల్ డివైజ్లకు వినియోగిస్తున్న లైటినింగ్ కేబుల్ పోర్ట్ను మొట్టమొదటిసారిగా 2013లో తీసుకొచ్చింది. అప్పట్నుంచి దాదాపు అన్ని యాపిల్ డివైజ్లకు దీన్నే వినియోగిస్తుంది. కానీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్, బ్రెజిల్లో తమ స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్లను విక్రయించాలంటే.. యాపిల్ ఈ కొత్త నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందే. టైప్ సి ఛార్జింగ్ కేబుల్కు మారే దిశగా యాపిల్ కంపెనీ ఇప్పటికే పని మొదలు పెట్టినట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం 2024లో యాపిల్ ప్రవేశపెట్టబోయే మొబైల్ టైప్ సీ ఛార్జింగ్ పోర్టుతో ఉండనుంది.
ప్రస్తుతానికి యూరోపియన్ యూనియన్, బ్రెజిల్లో మాత్రమే ఈ నిబంధన ఉంది. సింగిల్ ఛార్జింగ్ కేబుల్ రూల్స్ను అమలు చేయడంపై మిగిలిన దేశాలు ఎలాంటి సూచనలు చేయలేదు. కాబట్టి యాపిల్ కంపెనీ ఉన్నపళంగా అన్ని దేశాల్లో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ను అమలు చేయకపోవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి యూరోపియన్ యూనియన్, బ్రెజిల్లో మాత్రమే టైప్ సీ పోర్ట్ మొబైల్స్ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తమ ఛార్జింగ్ పిన్ను టైప్ సిలోకి మార్చేందుకు యాపిల్ ఇష్టపడకపోతే.. పోర్ట్లెస్ ఐఫోన్ను తయారు చేసే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.
ప్రస్తుతం ఐపాడ్ ఎయిర్, ఐపాడ్ ప్రో, ఐపాడ్ మినీ, మ్యాక్ బుక్ ప్రో, మ్యాక్ బుక్ ఎయిర్ తదితర డివైజ్ల్లో యూఎస్బీ సీ చార్జింగ్ పోర్ట్ను యాపిల్ తీసుకొచ్చింది. ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ ప్రో, ఎయిర్ పాడ్స్ మ్యాక్స్, మ్యాజిక్ కీబోర్డు, మ్యాజిక్ మౌస్ వంటి డివైజుల్లో ఇప్పటికీ లైటెనింగ్ కేబుల్నే వాడుతున్నారు. వీటిని కూడా 2024నాటికి యూఎస్బీ టైప్ సీ కనెక్టర్కు మార్చే అవకాశం ఉంది.
త్వరలోనే భారత్లోకి 5జీ సేవలు.. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? 4జీతో పోలిస్తే లాభమా? నష్టమా?”
“ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. ఐవోఎస్ 16లో ఉండే ఫీచర్లు ఇవే..”
G-mail in Offline | ఇక ఆఫ్లైన్లో జీ-మెయిల్ చెక్ చేసుకోవచ్చు.. ఇవీ డిటైల్స్!!