న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో (ఏఐ) శిక్షణ పొందాలనుకునే ఔత్సాహికుల కోసం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉచితంగా ఏఐ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ఆఫర్ చేస్తోంది. మైక్రోసాఫ్ట్ స్కిల్స్ ఫర్ జాబ్స్ ప్రోగ్రాం కింద కంపెనీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా లింక్డిన్తో కలిసి న్యూ, ఫ్రీ కోర్సు వర్క్ను అభివృద్ధి చేసింది. ఫ్రీ జనరేటివ్ ఏఐ లెర్నింగ్ కంటెంట్ను అందించేందుకు మైక్రోసాఫ్ట్, లింక్డిన్ చేతులు కలిపాయి.
ఈ న్యూ కోర్స్వర్క్లో భాగంగా అభ్యర్ధులు ఏఐ పరిచయ కాన్సెప్ట్స్, ఏఐ ఫ్రేమ్వర్క్స్ పై అవగాహన పెంచుకోవడంతో పాటు కోర్సు ముగిసిన అనంతరం కెరీర్ ఎసెన్షియల్స్ సర్టిఫికెట్ను పొందుతారు. జనరేటివ్ ఏఐలో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ను కోరుకునే వారికి ఈ ప్రోగ్రాం అనువైనదని చెబుతున్నారు. అంతర్జాతీయంగా భారత్ రెండో అత్యధిక ఏఐ టాలెంట్ పూల్ కలిగిన దేశమని, ఏఐ నైపుణ్యాల విషయంలో ప్రపంచంలోనే తొలి స్ధానంలో ఉందని నాస్కామ్ నివేదిక వెల్లడించింది.
పనిచేయడంలో నూతన పోకడలను ఏఐ సృష్టిస్తుందని అందుకే ఏఐలో ప్రజలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు న్యూ క్యాంపెయిన్ను లాంఛ్ చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. గత రెండేండ్లుగా దాదాపు 70,000 మంది మహిళా విద్యార్ధులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చామని కంపెనీ తెలిపింది.
Read More :