అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రాత్రి(1 అక్టోబర్, అర్ధరాత్రి 12 నుంచి) నుంచే ప్రారంభం కానుంది. కాకపోతే అది కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసమే. నిజానికి.. అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2021 అక్టోబర్ 3న ప్రారంభం కానున్నప్పటికీ.. స్పెషల్ గా ప్రైమ్ మెంబర్స్ కోసం ఇవాళ రాత్రి నుంచే సేల్ ప్రారంభం అవుతుంది.
అంటే.. ప్రైమ్ మెంబర్స్ కు 24 గంటల ముందే ఈ సేల్ కు యాక్సెస్ ఉంటుంది. స్పెషల్ డీల్స్, డిస్కౌంట్స్ అన్నీ ప్రైమ్ మెంబర్స్ కు ముందుగానే లభిస్తాయి. ఈ సేల్ లో భాగంగా అమెజాన్ లో 1000 కి పైగా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి.
సామ్ సంగ్, వన్ ప్లస్, జియోమీ, సోనీ, యాపిల్, బోట్, లెనోవో, హెచ్పీ, అసుస్ లాంటి బ్రాండ్లకు చెందిన పలు ప్రొడక్ట్స్ లాంచ్ అవనున్నాయి. ఈసారి స్మార్ట్ ఫోన్లు, వాటి యాక్సెసరీస్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.
అందులో వన్ ప్లస్ 9 సిరీస్, ఐఫోన్ 11, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ 5జీ ఫోన్ల ధరను తగ్గించడంతో పాటు.. పలు బ్యాంక్ ఆఫర్లు కూడా లభించనున్నాయి.
వన్ ప్లస్ 9ఆర్, వన్ ప్లస్ 9 ఫోన్ల మీద 3000 రూపాయల ధర తగ్గించారు. వన్ ప్లస్ 9 ప్రో మోడల్ మీద రూ.4000 డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ఎక్స్ఛేంజ్ మీద ఫోన్ ను తీసుకుంటే మరో రూ.10 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసేవాళ్లు మరో రూ.7000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
వన్ ప్లస్ నోర్డ్ 2, వన్ ప్లస్ నోర్డ్ సీఈ 5జీ ఫోన్లలోనూ రూ.1000 డిస్కౌంట్ లభించనుంది. దానితో పాటు అదనంగా 10 శాతం డిస్కౌంట్ ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ద్వారా పొందొచ్చు.
ఐఫోన్ 11 బేసిక్ మోడల్ ఎంఆర్పీ ధర రూ.49,900 కాగా.. ఈ ఫోన్ ను ప్రైమ్ సేల్ లో రూ.38,999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే.. 10,901 రూపాయల డిస్కౌంట్ ఈ సేల్ లో లభించనుంది. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ 5జీ ఫోన్ ధర రూ.50,999 కాగా.. ఈ సేల్ లో రూ.36,999 కే లభించనుంది. దానితో పాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ తో మరో 3000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభించనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Whatsapp Pay | వాట్సాప్లో ‘₹’ సింబల్.. ఇక ఈజీగా పేమెంట్స్
Slow Wi-Fi : వైఫై స్లోగా ఉందా? ఈ ట్రిక్స్ ఫాలో అయితే వైఫై సూపర్ ఫాస్ట్ స్పీడ్లో వర్క్ అవుతుంది
GriftHorse | ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లను వణికిస్తున్న కొత్త మాల్వేర్.. అసలేంటిది?