సంగారెడ్డి: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. జిల్లాలోని జహీరాబాద్ బస్ స్టేషన్, బస్ డిపోను సందర్శించిన ఎండీ.. అక్కడ కాసేపు తనిఖీలు నిర్వహించి మొక్కలు నాటారు. ఆనంతరం జహీరాబాద్లో ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కి సదాశివపేట వరకు ప్రయాణించారు.
ఈసందర్భంగా మాట్లాడిన సజ్జనార్.. ప్రజలంతా ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఆదాయం సంతృప్తికరంగా ఉందన్న ఎండీ.. త్వరలోనే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుందని ఆశిస్తున్నామన్నారు.