రాయికోడ్/సంగారెడ్డి : భారీ వర్షాలకు సింగూర్ డ్యామ్ నిండడతో మంజీరా నది పరివాహక ప్రజలు అప్రమతంగా ఉండాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. రాయికోడ్ మండల పరిధిలోని సిరూర్ గ్రామం శివారులో మంజీరా నదిపై నిర్మించిన వంతెనను సందర్శించారు. అలాగే పొంగి పొర్లుతున్న గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడూతూ.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు.
అధికారులు అందుబాటులో ఉండి వరద ఉధృతి సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఆయన వెంట వరం అధ్యక్షుడు వీరా రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నజీం పటేల్, మండల టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఇస్మాయిల్ పటేల్ ఉన్నారు.