నారాయణపేట, ఏప్రిల్ 19 : ప్రజలు కొవిడ్ నిబంధన లు పాటించడం ద్వారానే వైరస్ను నియంత్రించవచ్చని డీ ఎంహెచ్వో డాక్టర్ జయచంద్రమోహన్ తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 1,576 కరోనా పరీక్షలు నిర్వహించగా, 133 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నారాయణపేట పీపీ యూనిట్ పరిధిలో 12, నర్వ పీహెచ్సీలో 7, ధన్వాడ పీహెచ్సీలో 12, కర్నె పీహెచ్సీలో 9, దా మరగిద్ద పీహెచ్సీలో 10, పులిమామిడి పీహెచ్సీలో 19, గుండుమాల్ పీహెచ్సీలో 12, ఊట్కూర్ పీహెచ్సీలో 5, కోటకొండ పీహెచ్సీలో 10, మద్దూర్ పీహెచ్సీలో 16, మాగనూర్ పీహెచ్సీలో 12, మరికల్ పీహెచ్సీలో 3 కరో నా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కరోనా వ్యా ప్తిస్తున్న కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌన్సిలర్ అనిత, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుభాష్ అన్నారు. పట్టణంలోని 2వ వార్డులో మున్సిపల్ సిబ్బందితో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కొవిడ్ 19 కారణంగా పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. 45 ఏండ్లు పైబడిన వారు తప్పకుండా టీకా ను తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ వా ర్డు అధ్యక్షులు దేవరాజ్, చంద్రకాంత్ పాల్గొన్నారు.
కరోనాపై జాగ్రత్తగా ఉండాలి
ఊట్కూర్, ఏప్రిల్ 19 : కరోనా వ్యాధిపై ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సర్పంచ్ సావిత్రమ్మ అన్నారు. మం డలంలోని బిజ్వారంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ద్రావణా న్ని పిచికారీ చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని, గుంపులు గుంపులుగా ఒకే చోట కూర్చోవద్దని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గడిమున్కన్పల్లిలో…
దామరగిద్ద, ఏప్రిల్ 19 : రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మండలంలోని గడిమున్కన్పల్లిలో హై పోక్లోరైట్ ద్రావణాన్ని సర్పంచ్ సుభాష్ పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కేసు లు పెరుగుతుండడంతో ప్రజలందరూ తప్పకుండా మా స్కులు ధరించాలని అన్నారు. గ్రామంలో కేసులు పెరుగుతుండడంతో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించామన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్మికులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న టీకా
మక్తల్ టౌన్, ఏప్రిల్ 19 : కరోనా టీకా 45 ఏండ్లు పైబడిన ప్రతిఒక్కరూ వేసుకోవాలని డాక్టర్ సిద్ధప్ప అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో టీకా వేసే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క ర్నె దవాఖానలో 36 మంది, మక్తల్ దవాఖానలో 131 మందికి టీకా వేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు టీకా 2,593 మంది ఉపయోగించుకున్నారన్నారు.
ఉపాధ్యాయులకు టీకాలు
మక్తల్ రూరల్, ఏప్రిల్ 19 : టీకాపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోరాదని జెడ్పీ హెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ తెలిపారు. మండలంలోని కర్నె జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు స్థా నిక పీహెచ్సీలో టీకాతీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ టీకాలు వేయించామని పేర్కొన్నారు. ప్రజలంద రూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్వవహరించాలని హెచ్ఎం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.