పూడూరు, మార్చి 19 : దామగుండం అడవి పరిరక్షణతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం పూడూరు మండలం దామగుండ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆలయం వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి దామగుండం అటవీ రక్షణపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ అటవీ ప్రాంతాన్ని నేవి సిగ్నల్ కేంద్రానికి ప్రభుత్వం అప్పగించకుండా సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. దామగుండంలో నేవి సిగ్నల్ కేంద్రం ఏర్పాటుతో అడవిలోని కట్టెలను నరికి వేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కె.అనిల్రెడ్డి, సత్యానందస్వామి, పూడూరు ఉప సర్పంచ్ టి.రాజేందర్, బీజేపీ నాయకుడు మల్లేశం, శ్రీనివాస్గౌడ్ తీసుకువెళ్లారు. ఈ అసెంబ్లీ సమావేశంలో దామగుండం నేవి సిగ్నల్ కేంద్రం రద్దు చేసేలా సభలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, దేవాలయం వద్ద బోరుబావితో పాటు నూతన విద్యుత్ ఏర్పాట్లు చేయిస్తామన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో టీఆర్ఎస్ నాయకులు హరీశ్వర్రెడ్డి, శేఖర్, ప్రవీణ్, రఘురెడ్డి, సుజాత ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు భరోసా
పరిగి, మార్చి 19 : ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలోని తమ నివాసంలో పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, గండీడ్ మండలాలకు చెందిన 41 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 33.12లక్షల చెక్కులు, 4 ఎల్వోసీలు రూ.7.50లక్షలకు సంబంధించిన కాపీలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబాన్ని సర్కారు ఆదుకుంటుందన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు సీఎంఆర్ఎఫ్ భరోసానిస్తుందన్నారు. ఆయన వెంట జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, రాందాస్నాయక్, ఎంపీపీలు కె.అరవిందరావు, సత్యమ్మ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ నాయకులు ఆర్.ఆంజనేయులు, బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఎ.సురేందర్కుమార్ ఉన్నారు.