షాబాద్, డిసెంబర్ 26: మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి చేయూత ఇవ్వనున్నారు. ఈనెల 27న తన పుట్టిన రోజును పురస్కరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో అవినాశ్రెడ్డి అన్ని ప్రభుత్వ, ప్రాథమికోన్న త, ఉన్నత పాఠశాలలకు సుమారు రూ. 25 లక్షల సొంత నిధులతో 600 బెంచీలను అందించనున్నారు.
మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం ఉద యం 10 గంటలకు జరుగనున్న కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్రెడ్డి, ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, డీసీసీబీ చైర్మన్ బుయ్య ని మనోహర్రెడ్డి చేతుల మీదుగా బెంచీలను పంపిణీ చేయనున్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొ ని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, ప్రధా న కార్యదర్శి శ్రీరాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పీఏసీఏస్ చైర్మన్ శేఖర్రెడ్డి కోరారు.
మంత్రి కేటీఆర్ ఆశీస్సులు తీసుకున్న షాబాద్ జడ్పీటీసీ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ను షాబాద్ జడ్పీటీ సీ పట్నం అవినాశ్రెడ్డి సోమవారం కలిశారు. మంగళవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని నగరం లో మంత్రిని కలిసి ఆయన ఆశీస్సు లు తీసుకున్నారు. నిరంతరం ప్రజ ల్లో ఉంటూ అభివృద్ధి కోసం పరితపిస్తున్న అవినాశ్ను కేటీఆర్ అభినందించి, ఆశీస్సులు అందించారు.