నందిగామ, జూన్ 29 : ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో సాయిచంద్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పులమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ ఉద్యమంలో గాయకుడు సాయిచంద్ పాత్రను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జిల్లెల వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ కుమార్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, నాయకులు గోపాల్రెడ్డి, కృష్ణ, శ్రీనివాస్రెడ్డి, ఈశ్వర్, నర్సింహ, రవి, శ్రీను, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు.
కొత్తూరు : రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మరణం తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్ అన్నారు. కొత్తూరు చౌరస్తాలో సాయిచంద్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. భవిష్యత్ నాయకుడిని తెలంగాణ సమాజం కోల్పోయిందన్నారు. కార్యక్రమంలో దేవేందర్యాదవ్, రమేశ్, జనార్దన్, యాదయ్య, శ్రీనివాస్, దాసరి నర్సింహ, ప్రవీణ్, రాఘవేందర్, శివరాజ్, కృష్ణ పాల్గొన్నారు.
సాయిచంద్ మరణం తీరనిలోటు
యాచారం : సాయిచంద్ అకాల మరణం పార్టీకి తీరని లోటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ అన్నారు. శుక్రవారం గుర్రంగూడలో సాయిచంద్ భౌతికఖాయం వద్ద ఆయన నివాళులర్పించారు.
కేశంపేట : సాయిచంద్ ఆకస్మిక మృతి పట్ల కేశంపేట మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. ఉద్యమ సమయంలో సాయిచంద్ పాడిన పాటలు, చేసిన పోరాటాలు ఉద్యమానికి ఊపిరి పోశాయని ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల కొనియాడారు. వివిధ గ్రామాల్లో నివాళులర్పించారు. కార్యక్రమాల్లో మురళీధర్రెడ్డి, శ్రావణ్రెడ్డి,
నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆమనగల్లు/ మాడ్గుల : ఆమనగల్లు, మాడ్గుల మండలంలో గాయకుడు సాయిచంద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, కౌన్సిలర్ రాధమ్మ, ఎంపీటీసీ కుమార్, నాయకులు రామకృష్ణ, రఘు, వెంకట్రెడ్డి, బాలస్వామి, పాల్గొన్నారు.
కడ్తాల్ : రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మరణం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ర్టానికి తీరని లోటని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో సాయిచంద్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ పాల్గొన్నారు.