షాబాద్, నవంబర్ 22: తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండలంలోని నాగరగూడ, తాళ్లపల్లి, రుద్రారం, నాగరకుంట, హైతాబాద్, మద్దూర్ గ్రామాల్లో స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న ప్రతిపక్షాలకు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్, చేవెళ్లలో ఎమ్మెల్యేగా కాలె యాదయ్య హ్యాట్రిక్ విజయం సాధించనున్నట్లు స్పష్టం చేశారు. జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి మాట్లాడుతూ…బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రభుత్వం పనులు చేసింది కాబట్టే…ధైర్యంగా ఓటు అడుగుతున్నామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు కాలె యాదయ్య ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గూడూరు నర్సింగ్రావు, మాజీ జడ్పీటీసీ మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు శేరిగూడెం వెంకటయ్య, నక్క శ్రీనివాస్గౌడ్, నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు దేశమళ్ల ఆంజనేయులు, మండల కో-ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, సహకార సంఘం మాజీ చైర్మన్ ఈదుల నర్సింహులుగౌడ్, డైరెక్టర్లు యాదయ్య, దేవేందర్రెడ్డి, సర్పంచ్లు కావలి మల్లేశ్, ఈదుల కృష్ణాగౌడ్, బండ స్వర్ణలత, జయమ్మ, పెంటయ్య, ఎంపీటీసీలు గుత్తి సునీత, జముకమ్మ పాల్గొన్నారు.