ఇబ్రహీంపట్నంరూరల్ : టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా మార్చేందుకు నూతనంగా ఎన్నికైన సభ్యులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం టీఆర్ఎస్ నియోజకవర్గం యువజన విభాగం పూర్తి కమిటీని రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నియమించారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా జెర్కోని రాజు, ప్రధాన కార్యదర్శిగా జీవన్రెడ్డి, ఉపాధ్యక్షులుగా సురేందర్రెడ్డి, ఖాజు, రాఘవేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మహేశ్, మోటె శ్రీశైలం, కప్పరి రాజు, మధు, సంయుక్త కార్యదర్శులుగా వల్లవోజు సాయి, మహేందర్యాదవ్, ఆనంద్, ప్రచార కార్యదర్శులుగా చింతకింది వీరేశ్, శశికాంత్రెడ్డి, కొత్త గణేశ్గౌడ్, కోశాధికారిగా పాతూరి రాజేశ్, సభ్యులుగా కంబాపల్లి బాలు, పండుగల వినయ్గౌడ్, శ్రీరామ్యాదవ్, నారగజాజు, నిఖిల్రెడ్డి, రఘుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.