కొందుర్గు, మె 02 : యువత సన్మార్గంలో నడవాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లాల్పహాడ్ చౌరస్తాలో నూతనంగ ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మార్గం నేటి యువతకు ఆదర్శం. శివాజీ మార్గంలో యువత ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు.
అనంతరం కొందుర్గు మండలంలోని మహాదేవ్పూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కృష్ణయ్య ప్రమాద వశాత్తు మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉండటంతో ప్రమాద బీమా ద్వారా మంజూరై రెండు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేష్పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హాఫీజ్, శ్రీధర్రెడ్డి,రాజరామేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.