ఆదిబట్ల, మార్చి 11 : ప్రేమ పేరుతో ఇద్దరు యువకులు వేధించడంతోనే గిరిజన యువతి పల్లవి ఆత్మహత్య చేసుకున్నదని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఆదిబట్ల సీఐ రవికుమార్ శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ తండాకు చెందిన అంతి రామ్ రెండో కూతురు పల్లవి (21) రావిరాల వండర్లా పార్కులో పని చేసేది. రోజు మాదిరిగానే పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు వెతికినా ఆచూకీ లభించలేదు.
శుక్రవారం కొంగరకలాన్లో ఓ ప్రైవేట్ వెంచర్లో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ముందుగా పోలీసులు ఈ కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. తర్వాత యువ తి ఆత్మహత్యకు పాల్పడడంతో పోలీసులు హ త్యా, ఆత్మహ త్యా అనే కోణం లో విచారణ చేపట్టారు. తనతో పాటు వండర్లాలో పని చేస్తున్న యెలుక క్రాంతికిరణ్తో పల్లవికి పరిచయం ఏర్పడింది. అప్పటికే పల్లవి వండర్లాలో పని చేస్తున్న మరో యువకుడు ప్రణయ్తో ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో క్రాంతికిరణ్, ప్రణయ్ ఇద్దరు ప్రేమ పేరుతో గత రెండు, మూడు నెలలుగా వేధిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్యకు కారకులైన క్రాంతికిరణ్, ప్రణయ్ను అరెస్టు చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.