షాద్నగర్ : యాద్రాది లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయ గోపురం స్వర్ణ తాపడానికి రూ. 1,16,116 చెక్కును దేవాలయం ఈఓకు అందజేశామని జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి శుక్రవారం తెలిపారు. టీఎస్ క్యాబ్ పాలకవర్గ సమావేశ అనంతరం నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్రెడ్డి, టీఎస్ క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావుతో పాటు నాబార్డు అధికారులతో కలిసి దేవాలయాన్ని సందర్శించామని చెప్పారు. దేవాలయం నిర్మాణాలు తుది దశకు చేరడం సంతోషకరమని అన్నారు.