యాచారం : మండలంలోని గున్గల్ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు 6వ తరగతి నుంచి 10తరగతికి మిగిలి ఉన్న సీట్లు పూర్తి చేయడానికి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎనీమా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం కొరకు ఈ నెల 8నుంచి మార్చి 10వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆమె తెలిపారు. 6వ తరగతికి ఏప్రిల్ 17న 7నుంచి 10వరకు ఏప్రిల్ 16న పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దివ్యాంగుల విద్యార్థులు ప్రవేశ రుసుము రూ. 75, ఓసీ విద్యార్థులు రూ. 150 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.