సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రధాన రహదారులకు ప్రత్యామ్నాయం గా లింకురోడ్లను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మరం గా చర్యలు చేపట్టింది. నిర్ణయించిన గమ్యస్థానం చేరుకోవాలంటే ఎత్తైన కొండలు, బండరాళ్లు ఉన్నా వెనకడుగు వేయకుండా కొండల్ని తొలచి కొత్తదారులు వేసింది. ఆ కొత్తదారులు ఇప్పుడు ఐటీకారిడార్లో భారీ ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఊరటనిస్తున్నాయి.
గణనీయంగా పెరిగిన ట్రాఫిక్ రద్దీ సాఫీగా సాగేందుకు కొండల్ని తొలగించి కొత్తగా వేసిన దారులు నగరానికి కొత్త నడకలను నేర్పుతున్నాయి. అలా వేసినవే జూ బ్లీహిల్స్ రోడ్ నంబర్-51 నుంచి పాత ముంబై హైవే మార్గం, రాయదుర్గం నాలెడ్జ్ సిటీ నుంచి పాత ముంబై హైవే మా ర్గం, బయోడైవర్సిటీ నుంచి ఇంజినీరింగ్ సాఫ్ట్ కాలేజీ మీదు గా ఖాజాగూడ రోడ్డు, మణికొండ చిత్రపురి కాలనీ నుంచి ల్యాం కోహిల్స్, తిరిగి అక్కడి నుంచి ఖాజాగూడహి ల్స్ మీదుగా ఔటర్ రింగు రోడ్డు వరకు.. పలు లింకు రోడ్లన్నీ కొం డలు, గుట్టలతో కూడిన ప్రాంతాల మీదుగా నిర్మించారు. విశాలమైన వెడల్పుతో లింకురోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చి బీఆర్ ఎస్ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
కోర్సిటీలో అత్యంత కీలకమైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల నుంచి ఔటర్రింగు రోడ్డు వరకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా చేరుకోవడమే లక్ష్యంగా గత ప్రభుత్వం ఒక లింకురోడ్డును ప్రతిపాదించింది. కేబీఆర్పార్కును అనుకొని ఉన్న రోడ్డు నంబర్-45 నుంచి నేరు గా ఓఆర్ఆర్ దాకా వెళ్లేందుకు మూడు దశల్లో లింకురోడ్లను నిర్మించేలా ప్రతిపాదనలు రూ పొందించారు. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి, మాదాపూర్ హైటెక్సిటీ రోడ్లకు ప్రత్యామ్నాయంగా రాయదుర్గం, మణికొండ, ల్యాం కోహిల్స్, పుప్పాల్గూడ, ఖాజాగూడహిల్స్ మీదుగా ఓఆర్ఆర్ వరకు మొత్తం మూడు లింకురోడ్లను చేపట్టారు. ఈ మార్గంలో అన్ని గుట్టలతో కూడిన ప్రాంతాలే ఉన్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా దశలవారీగా ఒక్కో లింకు రోడ్డు నిర్మాణ పనులను హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఇంజినీర్లతో సమర్థవంతంగా పూర్తి చేయించి అందుబాటులోకి తీసు కొచ్చింది. ఈ మార్గంలో ఇప్పటికే 2 లింకురోడ్లు అందుబాటులోకి రాకా, చివరిదైన లింకురోడ్డు ల్యాంకోహిల్స్ నుంచి ఖాజాగూడహిల్స్, పుప్పాల్గూడ మీదుగా ఓఆర్ఆర్ వరకు నిర్మాణ పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. 3వ దశ లింకురోడ్డు ప్రారంభమైతే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45 నుంచి నేరుగా ఓఆర్ఆర్ వరకు ఎలాంటి ట్రాఫిక్ రద్దీ, సిగ్నల్స్ లేకుండా రాకపోకలు సాగించొచ్చు. దీంతో ఇప్పటివరకు ప్రధాన రహదారులపై ఉన్న రద్దీ సైతం గణనీయంగా తగ్గనున్నదని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.