వికారాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని నాలు గు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కొడంగల్, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎనుముల రేవంత్రెడ్డి, గడ్డం ప్రసాద్కుమార్, రామ్మోహన్రెడ్డి, బుయ్యని మనోహర్రెడ్డి విజ యం సాధించారు. కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్కుమార్ రికార్డు సృష్టించారు.
వికారాబాద్ నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఓడిపోయిన వ్యక్తులు గెలిచిన సందర్భంలేదు, అయితే గత రెండు పర్యాయాలు ఓడిపోయిన ప్రసాద్కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్రను తిరగరాశారు. అదేవిధంగా తాండూరు నుంచి గెలిచిన మనోహర్రెడ్డి పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలుపొందడం గమనార్హం. గతంలో జడ్పీటీసీగా, డీసీసీబీ చైర్మన్గా పనిచేసిన పరిగి నియోజకవర్గానికి చెందిన మనోహర్రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలువడం విశేషం.
బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డిపై 32,532 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్రెడ్డికి 1,07,429 ఓట్లురాగా, నరేందర్రెడ్డికి 74,897 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా వికారాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసాద్కుమార్ 12, 671 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రసాద్కుమార్కు 86,477 ఓట్లురాగా, ఆనంద్కు 73,806 ఓట్లు వచ్చాయి. పరిగి ఎమ్మెల్యే గా రామ్మోహన్రెడ్డి 22,481 ఓట్లతో గెలుపొందారు, రామ్మోహన్రెడ్డికి 96,284 ఓట్లురాగా, మహేశ్రెడ్డికి 73,803 ఓట్లు వచ్చాయి. తాండూరు ఎమ్మెల్యేగా 6,583 ఓట్ల మెజార్టీతో మనోహర్రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్రెడ్డికి 84,662 ఓ ట్లురాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్రెడ్డికి 78,079 ఓట్లు వచ్చాయి.
జిల్లాలో చాలామంది ఓటర్లు నోటాకు ఓటేశారు. అయితే ఏదేని నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటాకు ఓటేసే అవకాశాన్ని ఓటర్లకు ఎన్నికల సంఘం కల్పించింది. అయితే జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోనే అధిక మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. జిల్లావ్యాప్తంగా 5102 మంది ఓటర్లు నోటాకు ఓటేయగా,…వికారాబాద్ నియోజకవర్గంలో 1398 మంది, తాండూరు నుంచి 592 మంది, కొడంగల్ నుంచి 2002 మంది, పరిగి నియోజకవర్గంలో 1110 మంది ఓటర్లు నోటాకు ఓటేయడం గమనార్హం.
తాండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. విద్య, వైద్యం, రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యనిచ్చి నియోజకవర్గాన్ని ఓ మాడల్గా అభివృద్ధి చేస్తా. తాండూరులో కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు తగు చర్యలు తీసుకుంటా. జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి సీఎం కాబోతున్న దృష్ట్యా ఆయన సహకారంతో నియోజకవర్గాభివృద్ధికి భారీగా నిధులు తీసుకొస్తా.
– బుయ్యని మనోహర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే