కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, మైసిగండిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో మైసమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో రూ. 70లక్షలతో నిర్మిస్తున్న ప్రహారి శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీటను వేస్తున్నదని, రూ. 2వేల కోట్లతో యాదాద్రిలో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోనే మైసిగండి మైసమ్మ ఆలయం ప్రసిద్ధిగాంచిందని, మైసిగండి ఆలయ అభివృద్ధితో పాటు మైసిగండిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. మైసమ్మ ఆలయం ముందు రాజగోపురం నిర్మించడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులన్నింటిని త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఆలయ ఆవరణలో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పూల మాలలు, శాలువాలతో సన్మానించారు. అంతకుముందు మైసమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
టాయిలెట్స్ నిర్మాణానికి రూ. 10లక్షలు మంజూరు..
ఆలయ ఆవరణలో టాయిలెట్స్ నిర్మించాలని వైస్ ఎంపీపీ ఆనంద్ ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే టాయిలెట్స్ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేశారు. అలాగే ఆలయ ఆవరణలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 5 లక్షలు జడ్పీటీసీ దశరథ్నాయక్ మంజూరు చేశారు. మైసిగండి మైసమ్మ ఆలయ అభివృద్ధికి రూ. 100కోట్లు కేటాయించాలని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కోరగా, నిధుల మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, తాసిల్దార్ ఆర్పీ జ్యోతి, ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలీ, ఆలయ ఈవో స్నేహలత, సర్పంచ్ తులసీరాంనాయక్, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్ రాజారాం, ఆలయ నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, నాయకులు భాస్కర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వీరయ్య, శేఖర్గౌడ్, జహంగీర్అలీ, నరేశ్నాయక్, పాండునాయక్, లక్పతినాయక్, భీక్యానాయక్, శ్రీరాములుగౌడ్, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు.