బొంరాస్పేట, జూన్ 5 : ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డ రైతులను తెలం గాణ వచ్చిన తరువాత కరెంటు కష్టాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టెక్కించిందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని బురాన్పూర్లో రూ. 3.20 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ను 24 గంటలు సరఫరా చేయడం వల్ల రైతులు పంటలు బాగా పండిస్తున్నారని, జిల్లాలోని బొంరాస్పేట మండలంలో రికార్డు స్థాయిలో వరి సాగే దీనికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మండలంలో మూడు విద్యుత్ సబ్ స్టేషన్లు ఉంటే తొమ్మిదేళ్లలో మరో మూడు సబ్ స్టేషన్లు ప్రారంభించామని, విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుపడి రైతులకు నాణ్యమైన కరెంటు అందుతుందని చెప్పారు. బురాన్పూర్ సబ్ స్టేషన్ ప్రారంభం వల్ల 11 గ్రామాల ప్రజలు, రైతులకు లో వోల్టేజి సమస్య తీరి నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్నారు. సబ్ స్టేషన్కు స్థలం అందజేసిన రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్ర మంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ శ్రావణ్గౌడ్, జడ్పీటీసీ అరుణాదేశు, రైతు బంధు అధ్యక్షుడు రమణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఖాజా మైయినుద్దీన్, బొంరాస్పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు కోట్ల యాదగిరి, చాంద్పాషా, మాజీ వైస్ ఎంపీపీలు నారాయణరెడ్డి, సుదర్శన్రెడ్డి, సర్పంచ్లు లక్ష్మి, స్వాతి, ట్రాన్స్కో ఏడీ నవీన్, ఏఈ నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు దేశ్యానాయక్, హీర్యానాయక్, సంగప్ప, నర్సింహులు పాల్గొన్నారు.
ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం చేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి పౌర సరఫరాలశాఖ అధికారులను హెచ్చరించారు. వర్షాలు కురుస్తాయని అప్రమత్తం కావాలని ముందే చెప్పినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించకుండా అలాగే ఉంచారని, మిల్లర్లు కూడా కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను అన్లోడ్ చేయకుండా లారీల్లో అలాగే ఉంచుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని మెట్లకుంట, బొంరాస్పేట, బురాన్పూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించి ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మిల్లర్లు, సివిల్ సైప్లె అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్నగర్లోని గోదామును స్వాధీనం చేసుకుని ధాన్యాన్ని తరలించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ లేఖ రాసినా ఎందుకు పట్టించుకోవడం లేదని సివిల్ సైప్లె డీఎం విమల, పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతుంటే అధికారులు, మిల్లర్లు కలిసి తమాషాలు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్నగర్లోని గోదామును స్వాధీనం చేసుకుని అక్కడికి ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని వికారాబాద్, రంగారెడ్డి కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి సూచించారు. మండలంలో 15 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో కొనుగోలు కేంద్రానికి మూడు లారీల చొప్పున పంపించాలని జిల్లా రవాణశాఖ అధికారిని ఎమ్మెల్యే ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేసినా అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దౌల్తాబాద్ మండలంలో…
దౌల్తాబాద్, జూన్ 5: దౌల్తాబాద్ మండలంలోని గోకఫస్లవాద్ గ్రామంలో రూ.2 కోట్ల 50 లక్షల నిధులతో నూతన విద్యుత్ ఉప కేంద్రానికి ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ ఉపకేంద్రం పనుల ను త్వరితిగతిన పూర్తి చేయాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కేశవ రెడ్డి, సర్పంచు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇటీవలి నూతనంగా ఎన్ని కైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుజాతామోహన్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరె క్టర్లను మండల కేంద్రంలోని చెన్నకేశవ ఫంక్షన్ హాల్లో ఏర్పా టు చేసిన కార్యక్ర మంలో ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ మోహన్రెడ్డి, ఎంపీపీ విజయ్ కుమా ర్, మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి, బాయిరెడ్డి నరోత్తంరెడ్డి, వైస్ ఎంపీపీ మహి పాల్రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ జాకీర్అలీ, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.