వికారాబాద్, మార్చి 10 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాలో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణం, మన ఊరు-మన బడి, పల్లె ప్రగతి, ఇరిగేషన్ పనుల పురోగతిపై జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో సర్కారుకు చెడ్డపేరు వస్తుందన్నారు. గతంలో సూచించిన మేరకు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 10 రకాల పనులను చేపట్టాలని ఆదేశించారు. మార్చి 15 వరకు సూచించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి 17 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు సూచించిన పనులు సక్రమంగా నిర్వహించనైట్లెతే సంబంధిత అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. మన ఊరు-మన బడి కింద చేపడుతున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులను మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే పెండింగ్ పనులు పూర్తయిన వాటికి మూడు రోజుల్లో అంచనాలను కలెక్టర్ లాగిన్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మంజూరైన సీసీ రోడ్ల పనులకు సంబంధించి మార్చి 15లోపు ఎఫ్టీవో జనరేట్ చేసినైట్లెతే పనులు చేపడుతున్న సర్పంచ్లు, విద్యా కమిటీ చైర్మన్లు, కాంట్రాక్టర్లకు మార్చి 31లోపు చెల్లింపులు చేసినరవారమవుతామని తెలిపారు. జిల్లాలో 273 సీసీ రోడ్ల పనులు పూర్తయ్యాయని, 23 సీసీ రోడ్ల పనులు ఇంకా గ్రౌండింగ్ చేయలేదని, వీటికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని సూచించారు. జిల్లాలో 1,734 ట్రాన్స్ఫార్మర్లకు ఫెన్సింగ్ లేదని, నెల రోజుల్లోగా ప్రతి ట్రాన్స్ఫార్మర్కు ఫెన్సింగ్ ఉండేలా చూసి ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వో అశోక్కుమార్, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో తరుణ్కుమార్, డీఈవో రేణుకాదేవి, ఈఈలు పాల్గొన్నారు.
ఫెన్సింగ్ పనులు చేపట్టాలి
ఇకముందు జిల్లాలోని అటవీ భూముల్లో ఎలాంటి ఆక్రమణలు జరుగకుండా ఫెన్సింగ్ పనులు చేపట్టి నెల రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఎఫ్వో రాహుల్జాదవ్తో కలిసి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అటవీ భూములు, చెట్లతో పాటు వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ఆర్వోఆర్ చట్టం ప్రకారం అర్హులకు పోడు పట్టాలు ఇవ్వనున్నందున, బౌండరీ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే కబ్జాలో ఉన్న వ్యక్తులను ఇబ్బందులు కలుగకుండా నచ్చజెప్పి బౌండరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.