కేశంపేట : గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి పనులకే అధిక ప్రాధాన్యతనిస్తామని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల, లింగంధన, నిర్దవెళ్లి, బొదునంపల్లిలలో శనివారం ఎన్ఆర్ఈజీఎస్, సీడీపీ నిధులతో నిర్మించతలపెట్టిన సీసీరోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు భూమిపూజలు నిర్వహించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి సీసీరోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, హరితహారం మొక్కల పెంపకాన్ని చేపట్టిందని, పల్లెప్రగతితో ప్రతి గ్రామం క్లీన్అండ్ గ్రీన్గా మారాయన్నారు.
ఇప్పటికే గ్రామాల్లో రైతులు, ప్రజల అవసరాలకు రైతువేదికలు, వైకుంఠధామాలు, ఇంటింటికీ తాగునీరు అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫథకాలతో నిరుపేదలకు ఎక్కువ శాతం న్యాయం చేకూరుతుందని, రాబోవు రోజుల్లో పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేను ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్లు సావిత్రి బాల్రాజ్గౌడ్, పార్వతమ్మ, ఎదిరె కళమ్మ, నవీన్కుమార్, వెంకట్రెడ్డి, ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీటీసీలు మల్లేష్యాదవ్ పాల్గొన్నారు.