వికారాబాద్ : పట్టణంలోని అద్భుతమైన శ్మశాన వాటిక నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి, రామయ్యగూడ కాలనీల్లో శ్మశాన వాటిక నిర్మాణాల కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ శ్మశాన వాటిక నిర్మాణ పనులు నాణ్యతతో పాటు వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి స్థలాన్ని అప్పగించాలని తెలిపారు.
ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, కిరణ్పటేల్, నవీన్కుమార్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.