బొంరాస్ పేట : పంటల సాగులో వ్యవసాయాధికారులు ఇచ్చే సూచనలు, సలహాలను రైతులు పాటించాలని అప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా గణాంక అధికారిణి లక్ష్మీ కుమారి అన్నారు. బుధవారం మండలంలోని దుప్చెర్లలో రైతుల పొలాల్లో వానాకాలంలో సాగు చేసిన వరి పంటను కోతకోసి దిగుబడిని అంచనా వేశారు. పంట కోతను బట్టి దిగుబడిని అంచనా వేసినప్పుడే ఎంత మేర దిగుబడి వస్తుందో తెలుసుకోవచ్చన్నారు.
అధికారుల సూచనల మేరకు మందులు వాడుతూ పంటలు పండించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉప గణాంక అధికారి శ్రీరాములు, ఏఎస్వో శ్రీనివాసులు, ఏఈవో ఐజాక్ హెరాల్డ్, రైతులు పాల్గొన్నారు.