షాద్నగర్రూరల్, సెప్టెంబర్ 27 : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు తెలంగాణ సర్కార్ కృషి చేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడల ముగింపు సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం తెలంగాణ సర్కార్ ప్రతి విద్యార్థికి రూ.లక్షా 25వేలను వెచ్చిస్తున్నదన్నారు. సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయంగా సర్కార్ అడుగులు వేస్తున్నదన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టికాహారం, అన్ని మౌలిక వసతులను సమకూరుస్తున్నదన్నారు. అనంతరరం జోనల్ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. సమావేశంలో ఫరూఖ్నగర్ మండల జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, సర్పంచ్ నర్సింహులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యుల్లత, ఉపాధ్యాయిని ప్రణీత, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతోగానే ఆకట్టుకున్నాయి.
ప్రతిభ కనబర్చిన విద్యార్థులు
గురుకుల పాఠశాలలో నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థినులు ప్రతిభ కనబరిచి, అథ్లెటిక్స్ అండర్ 14, 17, 19 విభాగాల్లో మోమిన్పేట విద్యార్థిని అంకిత, కమ్మదనం గురుకులానికి చెందిన దుర్గ, త్రివేణి ఉత్తమ పతిభ కనబర్చారు.