పరిగి, ఏప్రిల్ 26 : అన్ని వర్గాల వారు సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ కానుకలను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రంజాన్కు ముస్లింలకు, క్రిస్మస్కు క్రిస్టియన్లకు కానుకలు అందజేయడంతోపాటు విందులు ఏర్పాటు చేస్తుందన్నారు. బతుకమ్మ పండుగకు మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తుందని చెప్పారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. అంతకుముందు పరిగిలోని మినీ స్టేడియంలో మందుల సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్అలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్రెడ్డి, నాయకుడు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, తహసిల్దార్ విద్యాసాగర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు మౌలానా, బి.రవికుమార్, నయీమ్ పాల్గొన్నారు.
పేద విద్యార్థికి ఎమ్మెల్యే ఆర్థికసాయం
పరిగి, ఏప్రిల్ 26 : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేద విద్యార్థి ఉన్నత చదువులకు ఆర్థికసాయం చేశారు. మహ్మదాబాద్ మండలంలోని మంగంపేటతండాకు చెందిన రాహుల్ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఐఐటీ కాన్పూర్లో ఇంజినీరింగ్లో రాహుల్ సీటు సాధించాడు. ఆర్థిక ఇబ్బందుల విషయం తెలియడంతో మంగళవారం ఎమ్మెల్యే రూ.30వేలు రాహుల్కు అందజేశారు.
గిరిజన తండాల అభివృద్ధికి కృషి
కులకచర్ల, ఏప్రిల్ 26 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం కులకచర్ల మండల పరిధిలోని దాస్యనాయక్తండా వన్నెకారి కుచ్చ శ్రీ పంచముకాంజనేయ స్వామి ఆలయ 30వ వార్షికోత్సవం సందర్భంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తోందని చెప్పారు. గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యే విధంగా చూస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన అడుగుల భజనకు ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి, జడ్పీటీసీ రాందాస్నాయక్, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దోమ మండల కేంద్రంలో కానుకల పంపిణీ
దోమ, ఏప్రిల్ 26 : మండల కేంద్రంలోని మజీద్లో అన్ని గ్రామాల ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, జడ్పీటీసీ నాగిరెడ్డి ముస్లింలకు పండ్లను తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం వారికి రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, కో ఆప్షన్ ఖాజాపాషా, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్యగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
కులకచర్ల, ఏప్రిల్ 26 : కులకచర్ల మండల కేంద్రంలోని మసీద్లో రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి పాల్గొని ప్రార్థనలు చేశారు. వారి వెంట మండల నాయకులు రాజు, జుబేర్, జడ్పీటీసీ రాందాస్నాయక్ ఉన్నారు.