మోమిన్పేట, ఆగస్టు 25 : నకిలీ ఆహార పదార్థాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం మోమిన్పేట పోలీస్స్టేషన్లో డీఎస్పీ సత్యనారాయణ, సీఐ వెంకటేశం, ఎస్సై విజయ్ ప్రకాశ్లతో కలిసి నకిలీ టీ పౌడర్ పట్టివేతపై విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం వికారాబాద్ జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్, మోమిన్పేట సీఐ ఎం.వెంకటేశం, టాస్క్ఫోర్స్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్, సిబ్బంది, మోమిన్పేట పోలీస్ సిబ్బందితో కలిసి మండల పరిధిలోని మొరంగపల్లి వై జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించగా మండలం, మీర్జాపూర్ గ్రామానికి చెందిన మ్యాదరి సుధాకర్(35) నకిలీ టీ పౌడర్ను ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఒడిస్సా రాష్ట్రం, గంజాం జిల్లా, కోడలా మండలం, భటాకలి గ్రామానికి చెందిన వ్యక్తి జగన్నాథ్ బిసోయి హైదరాబాద్ ఫతేనగర్ నేతాజీ కాలనీ బాలానగర్, మూసాపేటలో అతడి వద్ద రూ.145కి కిలో కొని గ్రామాల్లో సామాన్య ప్రజలకు రూ.180 కి అమ్ముతున్నట్లు తెలిపాడు.
టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫతేనగర్లోని జగన్నాథ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా పలు కంపెనీల పేర్లతో 42 క్వింటాళ్ల నకిలీ టీ పౌడర్, రెండు ప్యాకింగ్ యం త్రాలు, రుచి, రంగు వచ్చే రసాయన పదార్థాలు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తమిళనాడు నుంచి తక్కువ క్వాలిటీ కల్గిన బీ.పీ గ్రేడ్ టీ పౌడర్ తెప్పించి దానికి రసాయనాలతో రంగు, రుచి, వాసన వచ్చే విధంగా తయారు చేసి కిలోల చొప్పున విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు తెలిపాడు. పట్టుబడిన టీ పౌడర్ను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కోట్పల్లి మండలం మెయిన్ రోడ్డులో బాంబే టీ స్టాల్లో నకిలీ టీ పౌడర్ వాడుతున్నాడని సమాచారంతో బుధవారం టాస్క్ పోర్స్ సిబ్బంది టీ స్టాల్ యజమాని మహబూబ్(63), (మహారాష్ట్ర) అదుపులోకి తీసుకొని విచారించగా, మూసిలిగూడ కిషన్ బహగ్, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లాలో నివాసముంటున్న కర్ణాటక వాసి వసంత గిరి గోస్వామి దగ్గర రూ.300కిలో కి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. వసంతగిరి గోస్వామిని అదుపులోకి తీసుకొని విచారించగా హైదరాబాద్లో అస్సాం టీ పొడి కొని కిలోకి ఒక చెంచా చొప్పున ఎంఎస్కే ఫుడ్ కలర్, వెనీలా పౌడర్ కలిపి ఎంఆర్పీ, కంపెనీ పేరు లేకుండా ప్యాకింగ్ చేసి కిలో రూ.350 నుంచి 400 వరకు అమ్ముతానని తెలిపాడు. అతడి ఇంట్లో నూ సోదాలు నిర్వహించగా 20.60 క్వింటాళ్ల కల్తీ టీ పౌడర్, 10 కిలోల ఎంఎస్కే ఆరెంజ్ కలర్, రెండు డబ్బాల వెనీ లా, తూకం చేసే కాంట స్వాధీనం చేసుకొని, వీరిపై కోట్పల్లి స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో మోమిన్పేట, కోట్ పల్లి పోలీస్ , టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.