చేవెళ్లటౌన్, ఆగస్టు 23: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం నిరుపేదలకు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, సర్పంచ్లు ప్రభాకర్ రెడ్డి, మల్లారెడ్డి, మోహన్ రెడ్డి, నరహరి రెడ్డి, శైలజ, మాణిక్యరెడ్డి పాల్గొన్నారు.
శంకర్పల్లి : సీఎంఆర్ఎఫ్తో ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు భరోసా నిస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో రూ. 17.98 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టారా? అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ, చైర్ పర్సన్ విజయలక్ష్మి, సర్పంచ్లు సత్యనారాయణ, ఇందిర, కౌన్సిలర్లు అశోక్, లక్ష్మమ్మ, టీఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్కన్నా తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి పథకం కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, ఎంపీడీవో అనురాధ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గూడూర్ నర్సింగ్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్న, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, ఎంపీటీసీలు కరుణాకర్, మధుకర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్రెడ్డి, సత్యం, గోపాల్నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి
ఆమనగల్లు : నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మండలానికి చెందిన ఎన్ రాజుకు రూ.16 వేలు, వినోద్కు రూ.20 వేలు, జహంగీర్బీకి రూ.16 వేలు, అనితకు రూ. 21 వేలు తదితరులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ అందజేశారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు జంతుక అల్లాజీ, బాబా, విజయ్ రాథోడ్, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.