వికారాబాద్, ఆగస్టు 23: పోలీస్ కానిస్టేబుల్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో.. డీటీసీ శిక్షణా కేంద్రంలో పరీక్షా కేంద్రాల బయోమెట్రిక్ సిబ్బందితో కో-ఆర్డినేషన్ సమావేశాన్ని వేర్వేరుగా ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 28న జరుగనున్న కానిస్టేబుల్ పరీక్షను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని 61 కేంద్రాల్లో 17,073 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వివరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని.. నిమిషం నిబంధన అమ ల్లో ఉంటుందని, అందువల్ల అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈ పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు ఉంటుందని.. ఈ సందర్భంగా పరీక్షకు సంబంధించిన పలు సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్, రీజినల్ కో-ఆర్డినేటర్ అబ్బాస్అలీ, వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, డీటీసీ డీఎస్పీ విజయ్కుమార్, పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు, ఆర్ఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.